అప్పుులు తీర్చేందుకు అఘాయిత్యం.. తల్లీ, చెల్లికి విషం పెట్టిన కసాయి

తాను చేసిన అప్పులు  తీర్చేందుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడో వ్యక్తి. సొంత తల్లిని,చెల్లిని అన్నంలో విషం కలిపి చంపి ఏం తెలియనట్టు నటించాడు. అయితే పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఆ వ్యక్తిని విచారించిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా రావల్ కోల్ కు చెందిన సాయిరెడ్డి బీటెక్ పూర్తి చేసినా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తన తండ్రి ప్రభాకర్ రెడ్డి కొంతకాలం కిందట మరణించడంలో ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలని […]

Written By: Velishala Suresh, Updated On : November 30, 2020 9:46 am
Follow us on

తాను చేసిన అప్పులు  తీర్చేందుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడో వ్యక్తి. సొంత తల్లిని,చెల్లిని అన్నంలో విషం కలిపి చంపి ఏం తెలియనట్టు నటించాడు. అయితే పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఆ వ్యక్తిని విచారించిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా రావల్ కోల్ కు చెందిన సాయిరెడ్డి బీటెక్ పూర్తి చేసినా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తన తండ్రి ప్రభాకర్ రెడ్డి కొంతకాలం కిందట మరణించడంలో ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలని తల్లి సునీత, చెల్లి అనూషలతో గొడవపడేవాడు. అయితే క్రూరంగా ఆలోచించిన సాయిరెడ్డి ఈనెల 23న రాత్రి తన చెల్లి, తల్లి తినే భోజనంలో విషం కలిపాడు. అయితే మరుసటి రోజు ఉదయం వారు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఏం తెలియనట్టు మేడ్చల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఈనెల 26న అనూష, 27న సునీతలు మరణించారు. అయితే అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో సాయిరెడ్డిని విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.