మంజీరా నదిలో దూకి అధికారిణి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యవసాయాధికారిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. మనూరు మండలంలోని రావిపల్లి బ్రిడ్జిపై నుంచి దూకి అరుణ అనే వ్యవసాయాధికారి ఆత్మహత్య చేసుకున్నారు. అరుణ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్నారు. రావపల్లి బ్రిడ్జి వద్దకు తన కారులో వచ్చి బ్రిడ్జిపై నుంచి దూకారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నదిలో అరుణ కోసం గాలిస్తున్నారు. అయితే […]

Written By: Velishala Suresh, Updated On : November 26, 2020 6:48 pm
Follow us on

రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యవసాయాధికారిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. మనూరు మండలంలోని రావిపల్లి బ్రిడ్జిపై నుంచి దూకి అరుణ అనే వ్యవసాయాధికారి ఆత్మహత్య చేసుకున్నారు. అరుణ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్నారు. రావపల్లి బ్రిడ్జి వద్దకు తన కారులో వచ్చి బ్రిడ్జిపై నుంచి దూకారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నదిలో అరుణ కోసం గాలిస్తున్నారు. అయితే అరుణ మ్రుతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.