
చిత్తశుద్ధి ఉంటే నెలలోపే నోటిఫికేషన్లు ఇవ్వాలని టీజేఎస్ అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. తనను తాను రక్షించుకోవటానికే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని, రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తునందునే ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని చెప్పారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన అంశాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేసీఆర్ మభ్యపెడుతున్నారని, ఉద్యోగాల భర్తీ జరుగుతోందని నమ్మకం లేదని కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు