Mudragada Health: ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. గతంలో కూడా అనారోగ్యానికి గురైన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి సహాయంతో రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం ఆయన వైద్య సేవలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరు పరామర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పరామర్శించలేదు. అయితే దీని పైనే విమర్శలు వచ్చాయి. తన తండ్రి సేవలను వినియోగించుకున్న జగన్ ఆయనను చూడడానికి రాకపోవడాన్ని తప్పుపట్టారు ముద్రగడ కుమార్తె క్రాంతి. అయితే రోజురోజుకు ముద్రగడ ఆరోగ్యం పై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఆయన ఏ రుగ్మతతో బాధపడుతున్నారు అనేది తెలియలేదు.
Also Read: జగన్ రాజకీయంలో ‘ముద్రగడ’ కుటుంబం!
* వయోభారం అనుకున్నారు..
అయితే ఇప్పుడు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండడంతో పరిస్థితి తీవ్రతరం అవుతున్న విషయం తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. అయితే అంత వయోభారంతో అనుకున్నారు. ఎందుకంటే ఆయనకు ఏడుపదుల వయసు దాటింది. చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డితో సమకాలీకుడు. 1978లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. వారితో పాటే అసెంబ్లీలో అడుగు పెట్టారు.
* హైదరాబాదులో చికిత్స..
అయితే అంతా వయోభారం అనుకున్నారు. గుండె సంబంధిత రుగ్మత అని భావించారు. కానీ ముద్రగడ మాత్రం క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొన్న మధ్యన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఆయనను చేర్పించగా.. వైద్య సేవల కోసం ఆర్థికపరమైన ఇబ్బందులతో మరో ఆసుపత్రికి మార్చినట్లు వార్తలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం పై కూడా విమర్శలు వచ్చాయి. గంజాయి బ్యాచ్ ను పరామర్శించడానికి సమయం ఉంది కానీ.. మా నాన్నగారిని పరామర్శించేందుకు టైం లేదా అంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి ప్రశ్నించారు. ఈ తరుణంలో ముద్రగడ తన కుమార్తెను ఉద్దేశించి మాట్లాడిన పాత వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ముద్రగడ పరిస్థితి క్షీణిస్తోందని.. ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తుండడం మాత్రం చాలా బాధాకరం.
