https://oktelugu.com/

మాజీ ఎమ్మెల్యే మృతిపై కేసీఆర్ సంతాపం

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య శనివారం మరణించారు. ఆయన మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జీవితాంతం నమ్మిన సిద్ధాంతినిక కట్టుబడిన వ్యక్తిగా వెంకట నర్సయ్య నిలిచాడన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల బాగోగులను చూసుకున్నారన్నారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కల్లూరు మండలంలోని పోచారంలో కన్నుమూశారు. వెంకటనర్సయ్య మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఎంకు చెందిన ఆయన 2009లో పార్టీ విధానాలు […]

Written By: , Updated On : January 2, 2021 / 11:39 AM IST
KCR
Follow us on

KCR

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య శనివారం మరణించారు. ఆయన మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జీవితాంతం నమ్మిన సిద్ధాంతినిక కట్టుబడిన వ్యక్తిగా వెంకట నర్సయ్య నిలిచాడన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల బాగోగులను చూసుకున్నారన్నారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కల్లూరు మండలంలోని పోచారంలో కన్నుమూశారు. వెంకటనర్సయ్య మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఎంకు చెందిన ఆయన 2009లో పార్టీ విధానాలు నచ్చక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన మరణంపై ప్రముఖులు, పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.