ఎస్ఈసీ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు: విచారణ సోమవారానికి వాయిదా

గ్రేటర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబంధి పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లు పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వలు జారీ చేసింది. పలువురు ఉద్యోగులు స్వస్తిక్ గుర్తుకు బదులు పోలింగ్ సెంటర్ సంఖ్యను తెలిపే ముద్రల్ని ఇచ్చామని తెలపడంతో ఎస్ఈసీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంపై బీజేపీ కోర్టుకు వెళ్లి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ జరిపిన […]

Written By: Suresh, Updated On : December 4, 2020 10:24 am
Follow us on

గ్రేటర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబంధి పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లు పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వలు జారీ చేసింది. పలువురు ఉద్యోగులు స్వస్తిక్ గుర్తుకు బదులు పోలింగ్ సెంటర్ సంఖ్యను తెలిపే ముద్రల్ని ఇచ్చామని తెలపడంతో ఎస్ఈసీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంపై బీజేపీ కోర్టుకు వెళ్లి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు ఆ సర్య్కులర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.