రాబోయే 48 గంటల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సీఎస్ సోమేశ్కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. వరదలు, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షింత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. కాగా ఈ రెండు రోజులు మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.