భారీగా తరలిస్తున్న మద్యం పట్టివేత

ఓ బస్సులో భారీగా మద్యం తరలిస్తుండగా రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని సాతంరాయి వద్ద ఎస్ఓటీ బ్రుందం తనిఖీలు చేపట్టింది. అయితే ఓ ప్రైవేట్ బస్సులో నుంచి కాటన్లను ఆటోలోకి ఎక్కిస్తుండగా అటువైపు వెళ్తున్న పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ కాటన్లను తనిఖీ చేయగా అందులో మద్యం సీసాలు కనిపించాయి. దీంతో 14 కాట్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అక్కడున్న నలుగురిని అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. ఈ మద్యం […]

Written By: Velishala Suresh, Updated On : December 18, 2020 10:37 am
Follow us on

ఓ బస్సులో భారీగా మద్యం తరలిస్తుండగా రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని సాతంరాయి వద్ద ఎస్ఓటీ బ్రుందం తనిఖీలు చేపట్టింది. అయితే ఓ ప్రైవేట్ బస్సులో నుంచి కాటన్లను ఆటోలోకి ఎక్కిస్తుండగా అటువైపు వెళ్తున్న పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ కాటన్లను తనిఖీ చేయగా అందులో మద్యం సీసాలు కనిపించాయి. దీంతో 14 కాట్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అక్కడున్న నలుగురిని అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. ఈ మద్యం విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని, దీనిని గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారని వారు పేర్కొన్నారు.