తమ్ముడికి అడ్డుగా ఉండబోయిన అన్న హత్య..

తన తమ్ముడిపై దాడి చేయడానికి వచ్చిన కొందరిని అడ్డుకున్నందుకు వారు అన్నను హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లోని గోషామహల్‌లో చోటు చేసుకుంది. గోషామహల్‌ చంద్రకిరణ్‌ బస్తీకి చెందిన కొండ్ర మధుకు 17 ఏళ్ల ఓ తమ్ముడు ఉన్నాడు. అదే బస్తికి చెందిన ప్రకాశ్‌ కూతురిని మధు తమ్ముడు ప్రేమించసాగాడు. ఈ విషయం ప్రకాశ్‌కు తెలియడంతో సదరు యువకుడిని హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో గురువారం అర్ధరాత్రి ప్రకాశ్‌తో పాటు శంకర్‌, కుమార్‌ అనే వ్యక్తులు మధు తమ్ముడి ఇంటికి […]

Written By: Suresh, Updated On : October 30, 2020 12:00 pm

murderd

Follow us on

తన తమ్ముడిపై దాడి చేయడానికి వచ్చిన కొందరిని అడ్డుకున్నందుకు వారు అన్నను హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లోని గోషామహల్‌లో చోటు చేసుకుంది. గోషామహల్‌ చంద్రకిరణ్‌ బస్తీకి చెందిన కొండ్ర మధుకు 17 ఏళ్ల ఓ తమ్ముడు ఉన్నాడు. అదే బస్తికి చెందిన ప్రకాశ్‌ కూతురిని మధు తమ్ముడు ప్రేమించసాగాడు. ఈ విషయం ప్రకాశ్‌కు తెలియడంతో సదరు యువకుడిని హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో గురువారం అర్ధరాత్రి ప్రకాశ్‌తో పాటు శంకర్‌, కుమార్‌ అనే వ్యక్తులు మధు తమ్ముడి ఇంటికి వచ్చి దాడికి యత్నించారు. పక్క గదిలో ఉన్న మధు లేచి వారిని అడ్డుకోబోయారు. ఈ తరుణంలో మధుపై ఆ ముగ్గురు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు షాహినాయత్‌గంజ్‌ సీఐ చాంద్‌బాషా తెలిపారు.