
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టినా.. మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 627కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,80,822 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,510గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,72,370 మంది కోలుకోగా ప్రస్తుతం 6,942యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 4,814 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 46,694 కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.