
తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 761కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,67,665 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,448గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,55,378 మంది కోలుకోగా ప్రస్తుతం 10,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి.