పోలింగ్ బూత్ లో సీఐ వీరంగం

హైదరాబాద్: కూకట్‌పల్లి డివిజన్‌ దీనబంధు కాలనీలో జగద్గిరిగుట్ట సీఐ వీరంగం సృష్టించారు. బూటు కాళ్లతో పోలింగ్ బూత్‌ టేబుళ్లను సీఐ తన్నడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ కార్యకర్తలను దూషించడంతో పోలీసులు టీఆర్‌ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. మరోవైపు జీడిమెట్ల డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ ఘర్షణ, తోపులాట జరిగింది. పోలింగ్ స్టేషన్ బయట టేబుల్ ఏర్పాటు విషయంలో గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు.  

Written By: Suresh, Updated On : December 1, 2020 2:07 pm
Follow us on

హైదరాబాద్: కూకట్‌పల్లి డివిజన్‌ దీనబంధు కాలనీలో జగద్గిరిగుట్ట సీఐ వీరంగం సృష్టించారు. బూటు కాళ్లతో పోలింగ్ బూత్‌ టేబుళ్లను సీఐ తన్నడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ కార్యకర్తలను దూషించడంతో పోలీసులు టీఆర్‌ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. మరోవైపు జీడిమెట్ల డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ ఘర్షణ, తోపులాట జరిగింది. పోలింగ్ స్టేషన్ బయట టేబుల్ ఏర్పాటు విషయంలో గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు.