రైతు వేదికకు కేంద్రం రూ.12 లక్షలు: రఘునందన్ రావు

రైతు వేదికకు కేంద్రం రూ. 12 లక్షలు ఇచ్చిందని, రైతులు తమ కల్లాల కోసం ఈజీఎస్ నిధులను వాడుకోవాలకి కేంద్రం చెప్పిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. టీఆర్ఎస్ లో చాలా మంది అసంతృప్తులు ఉన్నారని, వారు త్వరలో బీజేపీలోకి వస్తారని చెప్పారు. ఉప ఎన్నిక సమయంలో తనపై పెట్టిన కేసులను త్వరలో […]

Written By: Suresh, Updated On : November 16, 2020 3:26 pm
Follow us on

రైతు వేదికకు కేంద్రం రూ. 12 లక్షలు ఇచ్చిందని, రైతులు తమ కల్లాల కోసం ఈజీఎస్ నిధులను వాడుకోవాలకి కేంద్రం చెప్పిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. టీఆర్ఎస్ లో చాలా మంది అసంతృప్తులు ఉన్నారని, వారు త్వరలో బీజేపీలోకి వస్తారని చెప్పారు. ఉప ఎన్నిక సమయంలో తనపై పెట్టిన కేసులను త్వరలో న్యాయస్థానంలో గెలుస్తామని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గం 99 శాతం గ్రామీణ ప్రాంతమని, కొత్తగా మున్సిపాలిటీ చేశారన్నారు. 14వ కమిషన్ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాలేదని చెప్పారు. ఈజీఎస్ నిధులతోనే సిమెంట్ రోడ్లు వేశారన్నారు.