హైదరాబాద్కు చెందిన దంత వైద్యుడిని కిడ్నాపర్ల నుంచి రక్షించిన పోలీసులకు మరో సవాల్ ఎదురయింది. నగరంలోని రాజేంద్రనగర్లో మరో కిడ్నాప్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన గౌస్ అనే వ్యక్తి హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. అయితే అతని మొదటి భార్యకు పిల్లలకు కాకపోవడంతో ఎక్కువగా రెండో భార్యతో చనువుగా ఉంటున్నాడు. దీంతో మొదటి భార్య బంధువులే కిడ్నాప్ చేశారంటూ రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.