యశోధ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నాయకుడు

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ యశోదా ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. చలి తీవ్రత ఎక్కువ కావడంతో ఆయనకు శ్వాస ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు. కాగా విషయం తెలిసిన ఆయన అభిమానుల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన సోదరుడు రాంకుమార్ తెలిపారు. గత ఎన్నికల్లో లక్ష్మణ్ […]

Written By: Velishala Suresh, Updated On : December 27, 2020 9:19 am
Follow us on

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ యశోదా ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. చలి తీవ్రత ఎక్కువ కావడంతో ఆయనకు శ్వాస ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు. కాగా విషయం తెలిసిన ఆయన అభిమానుల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన సోదరుడు రాంకుమార్ తెలిపారు. గత ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.