తెలంగాణలో కొత్తగా 536 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 500 లోపే కేసులు నమోదు కాగా తాజాగా ఆ పైన పాజిటివ్ రిపోర్టుల సంఖ్య వచ్చింది. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 536 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,79,135 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,502గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. […]

Written By: Suresh, Updated On : December 16, 2020 9:15 am
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 500 లోపే కేసులు నమోదు కాగా తాజాగా ఆ పైన పాజిటివ్ రిపోర్టుల సంఖ్య వచ్చింది. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 536 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,79,135 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,502గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,70,450 మంది కోలుకోగా ప్రస్తుతం 7,183యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 5,041 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 52,057 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.