ఒక్కరి నుంచి 22 మందికి పాకిన కరోనా..!

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా తగ్గుతున్నా కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ విస్తరిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 22 మందకి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సూర్యపేట జిల్లాలోని యాదాద్రి టౌన్ షిప్ లో తన బంధువు ఒకరో చనిపోతే అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తరువాత పలువురు బంధువులను కలుసుకున్నాడు. అయితే గత నెల 31న అస్వస్థతకు గురి కావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో అతనికి […]

Written By: Suresh, Updated On : January 2, 2021 3:13 pm
Follow us on

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా తగ్గుతున్నా కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ విస్తరిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 22 మందకి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సూర్యపేట జిల్లాలోని యాదాద్రి టౌన్ షిప్ లో తన బంధువు ఒకరో చనిపోతే అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తరువాత పలువురు బంధువులను కలుసుకున్నాడు. అయితే గత నెల 31న అస్వస్థతకు గురి కావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో అతనికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ విషయం అతనిని కలిసిన వారికి తెలియగా వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇలా తనను కలిసిన వారందరికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. కాగా వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.