హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలతో సమీపంలో ఉన్న 185 చెరువు నిండాయని జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. వీటిలో గండిపడిన 3 చెరువులకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. ముసాపేట్, బండ్లగూడ, మాన్సూరాబాద్ చెరువులు డ్యామేజ్ కాలేదన్నారు. చెరువుల కబ్జాపపై చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 53 చెరువు ధ్వంసం అయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రజత్ తెలిపారు.