ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య మరణించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కల్లూరు మండలంలోని పోచారంలో ఉంటున్నా ఆయన శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. వెంకటనర్సయ్య మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఎంకు చెందిన ఆయన 2009లో పార్టీ విధానాలు నచ్చక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన మరణంపై ప్రముఖులు, పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.