Homeజాతీయ వార్తలుNational Space Day 2024: జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ఇస్రో చంద్రయాన్ -3 మిషన్ గురించి...

National Space Day 2024: జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ఇస్రో చంద్రయాన్ -3 మిషన్ గురించి నేడు తెలుసుకోవాల్సిందే..

National Space Day 2024 : జాతీయ అంతరిక్ష దినోత్సవం భారత్ కు చారిత్మాత్మకమైన రోజు. ఎందుకంటే దేశం అంతరిక్ష అన్వేషణ, ప్రయోగాల్లో అద్భుతమైన విజయాలను నమోదు చేస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అంతరిక్ష సమాజంలో భారత్ కు పెరుగుతున్న ప్రాముఖ్యత నేపథ్యంలో నిర్వహించుకోవడం ఇదే మొదటిసారి. ఈ రోజు గత విజయాల వేడుక మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి నిచ్చే క్షణం, మన ప్రపంచాన్ని రూపొందించడంలో అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. భారత శాస్త్ర, సాంకేతిక పురోగతిలో అంతరిక్ష పరిశోధనలు పోషించిన కీలక పాత్రను 2024 జాతీయ అంతరిక్ష దినోత్సవం గుర్తిస్తుంది. ఆగస్ట్ 23, 2023న చంద్రుడిపైకి రోవర్ ను పంపిన నాలుగో దేశంగా చరిత్రలో నిలిచింది భారత్. చంద్రయాన్ -3 మిషన్ విజయానికి అనుగుణంగా ఈ తేదీని ఎంచుకున్నారు. ఇస్రో విజయాలను గుర్తుచేసుకోవడంతో పాటు జాతీయంగా గర్వ పడాల్సిన సమయం. 2023, ఆగస్ట్ 23న చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిందని ఇస్రో పేర్కొంది. దీంతో చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ ను విజయవంతంగా బయటకు తీసుకురాగలిగారు. చంద్రయాన్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ‘శివ శక్తి’ పాయింట్ (స్టాటియో శివశక్తి) అని పేరు కూడా పెట్టారు. అందుకే ఆగస్ట్ 23ను ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించారు. 2024, ఆగస్ట్ 23న భారత్ తన తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోనుంది.

భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024 థీమ్ ‘చంద్రుడిని తాకేటప్పుడు జీవితాలను తాకడం’. మానవ జ్ఞానం, సృజనాత్మకతను నిరంతరం ముందుకు తీసుకెళ్తూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో గ్లోబల్ లీడర్ గా భారత్ ఎదిగింది. సామాజిక అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు, అంతర్జాతీయ సహకారాన్ని భారత్ అందిస్తుంది.

‘ఇండియన్ స్పేస్ సాగా’ థీమ్ తో ఆగస్ట్ 23, 2024న దేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని (ఎన్ఎస్‌పీడీ-2024) జరుపుకుంటుందని ఇస్రో పేర్కొంది. అంతరిక్షంలో దేశం సాధించిన అసాధారణ విజయాలు సమాజానికి అసాధారణ ప్రయోజనాలు చేకూరుస్తాయి.

చంద్రయాన్-3 గురించి తెలుసుకోవాల్సిందే..
చంద్రుడి వైపు ప్రయాణం..
2008, అక్టోబర్ లో చంద్రయాన్ -1తో చంద్రుడిపైకి ఇస్రో ప్రయాణం ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై నీటి అణువులను కనుగొన్న మొదటి భారతీయ మిషన్ ఇదే కావడం విశేషం. చంద్రుడిపై నీటి అణువులను కనుగొనడంలో భారత్ కు చెందిన చంద్రయాన్ -1 కీలక పాత్ర పోషించిందని ‘నాసా’ కూడా పేర్కొంది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ లక్ష్యంగా ఇస్రో 2019, జూలైలో చంద్రయాన్-2ను ప్రయోగించింది. దురదృష్టవశాత్తు చివరి దశలో కమ్యూనికేషన్ తెగిపోయి చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. ఈ ఎదురుదెబ్బ తగిలినా.. చంద్రయాన్ -2 ఆర్బిటర్ చంద్రుడిపై అధ్యయనం చేస్తూ.. విలువైన డేటాను భూమికి పంపింది.

చంద్రయాన్-2 ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ 100 కిలో మీటర్ల x 100 కిలో మీటర్ల కక్ష్యలో ఉందని, సెప్టెంబర్ 2న విక్రమ్ ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడిపోయి కక్ష్యను 35 కిలో మీటర్లకు 101 కిలో మీటర్లకు కుదించేందుకు డీ ఆర్బిటింగ్ విన్యాసాలు నిర్వహించామని ఇస్రో పేర్కొంది.

సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండింగ్ కు ప్రయత్నించామని, 35 కిలో మీటర్ల కక్ష్య నుంచి ఉపరితలానికి 2 కిలో మీటర్ల ఎత్తులో దిగేందుకు ప్రణాళికాబద్ధమైన మార్గాన్ని అనుసరించామని తెలిపారు. ల్యాండర్, గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయాయి. ల్యాండర్ అన్ని వ్యవస్థలు, సెన్సార్లు ఈ దశ వరకు అద్భుతంగా పనిచేశాయి. ల్యాండర్ లో ఉపయోగించిన వేరియబుల్ థ్రస్ట్ ప్రొపల్షన్ టెక్నాలజీ వంటి అనేక సాంకేతికతలను నిరూపించాయి. అయితే, ఆర్బిటర్ బాగానే ఉందని, పేలోడ్లన్నీ పనిచేస్తున్నాయని తెలిపింది.

తదుపరి మిషన్ చంద్రయాన్ -3. చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్, రోవింగ్ లో ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు చంద్రయాన్-2కు కొనసాగింపు మిషన్ చంద్రయాన్-3 అని ఇస్రో పేర్కొంది. ఇందులో ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. శ్రీహరికోటలోని ఎస్డీ ఎస్సీ షార్ నుంచి ఎల్వీఎం 3 ద్వారా దీన్ని ప్రయోగించనున్నారు.

చంద్రయాన్-3 లక్ష్యాలు..
సాఫ్ట్ ల్యాండింగ్..: విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయడమే ప్రధాన లక్ష్యం. మానవ అంతరిక్ష యాత్రలతో సహా భవిష్యత్ మిషన్లకు అవసరమైన ల్యాండింగ్ ఇస్రో సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించడంలో ఇది ఒక కీలకమైన దశ.

రోవర్ అన్వేషణ..: ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ కాగానే ప్రజ్ఞాన్ రోవర్ ను మోహరిస్తుంది. ఈ రోవర్ చంద్రుడి దక్షిణ ధృవంపై మట్టి, శిలలను అధ్యయనం చేస్తుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై వాతావరణాన్ని విశ్లేషించేందుకు, విలువైన డేటాను భూమికి పంపేందుకు ఉపయోగపడుతుంది.

శాస్త్రీయ అన్వేషణ..: చంద్రుడి ఉపరితలం, భూకంప, ఎక్సోస్పియర్ అధ్యయనంపై దృష్టి సారించిన చంద్రయాన్ -2 శాస్త్రీయ లక్ష్యాలను చంద్రయాన్ -3 కొనసాగిస్తుంది. ఇది చంద్రుడు ఎలా రూపొందాడు, అక్కడి భూమి తీరు.. నీటి అణువుల ఉనికిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా అన్వేషణ సాగింది.

చంద్రయాన్-3 స్పెసిఫికేషన్లు..
చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ అనే మూడు ప్రాథమిక భాగాలు ఉన్నాయి. చంద్రయాన్ -2 మాదిరిగా కాకుండా, చంద్రయాన్ -3లో ఆర్బిటర్ లేదు. ఎందుకంటే మునుపటి మిషన్ నుంచి ఆర్బిటర్ పనిచేస్తూ కమ్యూనికేషన్లను ప్రసారం చేయగలదు.

చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం), ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం), రోవర్ ఉన్నాయని, ఇంటర్ ప్లానెటరీ మిషన్లకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగం జరిగిందని ఇస్రో పేర్కొంది. ల్యాండర్ ఒక నిర్దిష్ట చంద్రుడి ప్రదేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దాని కదలిక సమయంలో చంద్రుడి ఉపరితలంపై అంతర్గత రసాయన విశ్లేషణను చేపట్టే రోవర్ ను మోహరించగలదు. చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేసేందుకు ల్యాండర్, రోవర్లకు శాస్త్రీయ పేలోడ్స్ ఉన్నాయి.

జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024 దేశానికి ఒక ముఖ్యమైన సందర్భం, అంతరిక్ష అన్వేషణలో దేశం సాధించిన అసాధారణ విజయాలను ఈ రోజు నిర్వహించుకుంటుంది. మరింత ఉజ్వల భవిష్యత్ కోసం ఎదురుచూస్తోంది. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడం నుంచి మానవ అంతరిక్ష యాత్రలను ప్లాన్ చేసే వరకు, ఆవిష్కరణ, పట్టుదల, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నిబద్ధతతో కూడిన ప్రయాణం గురించి ప్రతిబింబించే రోజు.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular