జియో కొత్త ప్లాన్.. రోజుకి 3జీబీ డేటా!

కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్ల నుంచి పనిచేసే వారికి జియో ప్రత్యేక ఇంటర్నెట్ రోజుకి 3జీబీ డేటా ప్లాన్ ని  విడుదల చేసి గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ అమలులో ఉండటంతో ఎక్కువ మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దింతో జియో యాజమాన్యం కొత్త ప్లాన్ ని ప్రకటించింది. రూ.999 రీఛార్జీతో 84 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 6:51 pm
Follow us on

కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్ల నుంచి పనిచేసే వారికి జియో ప్రత్యేక ఇంటర్నెట్ రోజుకి 3జీబీ డేటా ప్లాన్ ని  విడుదల చేసి గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ అమలులో ఉండటంతో ఎక్కువ మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దింతో జియో యాజమాన్యం కొత్త ప్లాన్ ని ప్రకటించింది.

రూ.999 రీఛార్జీతో 84 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటాను అందివ్వనున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఇతర జియో ల్యాండ్‌ లైన్‌, మొబైల్‌ నంబర్లకు అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజువారీ 100 ఎస్సెమ్మెస్‌లు అదనం. ఇతర నెట్‌వర్క్‌ నంబర్లకు 3,000 వాయిస్‌ కాలింగ్ నిమిషాలు ఈ రీఛార్జీతో లభించనున్నాయి. అంతే కాకుండా జియో యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం. జియో ఇప్పటికే రూ.444 రీఛార్జీతో రోజువారీ 2జీబీ డేటా 56 రోజులు, రూ.599 రీఛార్జీతో రోజువారీ 2జీబీ డేటా, రూ.555 రీఛార్జీతో 1.5జీబీ డేటా ప్లాన్లు 84 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ ఇళ్ల నుంచి పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.