Homeక్రీడలుక్రికెట్‌Suryakumar Yadav captaincy future: సూర్య కుమార్ యాదవ్ ను తప్పిస్తారా.. తర్వాత ఏం జరుగుతుందో...

Suryakumar Yadav captaincy future: సూర్య కుమార్ యాదవ్ ను తప్పిస్తారా.. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా..

Suryakumar Yadav captaincy future: భారత జట్టుకు టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లలో సూర్య కుమార్ యాదవ్ మూడోవాడు. ముందుగా ధోని.. ఆ తర్వాత రోహిత్ టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ లు అందించారు. సూర్య కుమార్ యాదవ్ ఇటీవలి టి20 ప్రపంచ కప్ లో టీమిండియాను విజేతగా నిలపడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆటగాడిగా తన ముద్ర బలంగా వేసుకోలేకపోయినప్పటికీ.. జట్టును మాత్రం సమర్థవంతంగా నడిపించాడు.

ఆటగాడిగా అతడు విఫలమవుతున్న నేపథ్యంలో టి20 జట్టు సారథి బాధ్యతల నుంచి అతడిని తప్పిస్తారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ బాధ్యతను అయ్యర్ కు అప్పగిస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. అయ్యర్ తో పాటు తిలక్ వర్మ, సంజు శాంసన్ రేసులో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టే విషయంలో ఇంతవరకు మేనేజ్మెంట్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాకపోతే మీడియాలో ఈ తరహా వార్తలు వస్తున్న నేపథ్యంలో అది నిజమే కావచ్చని అందరూ అనుకుంటున్నారు.

సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ స్థానం నుంచి తప్పించే విషయంలో మాజీ కోచ్ ఎంఎస్కే ప్రసాదు కీలక వ్యాఖ్యలు చేశారు..”ఇంగ్లాండ్ పర్యటనకు ముందుగా ప్రధాన జట్టును పంపిస్తారా.. లేకుంటే రెండవ స్థాయి జట్టను పంపిస్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ అత్యుత్తమమైన బృందాన్ని పంపిస్తే.. సూర్య కుమార్ యాదవ్ దానికి సారధ్యం వహించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత నుంచి అతడిని తప్పిస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఒకవేళ కొత్త సారధిని సిద్ధం చేసుకోవాలి అనుకుంటే.. ముందు సూర్య కుమార్ యాదవ్ ను ఉప నాయకుడిగా నియమించుకోండి. ఆ తర్వాత మిగతా కథను పూర్తి చేయండి. టి20 ప్రపంచ కప్ సాధించేవరకు అక్షర్ పటేల్ రెండవ నాయకుడిగా ఉండేవాడు. ఇప్పుడు నాయకుడి బాధ్యతలను స్వీకరించడానికి చాలామంది ప్లేయర్లు రంగంలో ఉన్నట్టు తెలుస్తోంది. సూర్య అద్భుతమైన ఆటగాడు. కాకపోతే కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. కొత్త కుర్రాళ్ళు కూడా అవకాశాల కోసం తాపత్రయపడుతున్నారు. అలాంటప్పుడు సూర్యను నాయకుడి స్థానం నుంచి తప్పించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అతడికి కొన్ని అవకాశాలిస్తే.. నిరూపించుకుంటాడు. అప్పటికి అతడు నిలబడకపోతే పక్కన పెట్టడం బెటర్ అని” ప్రసాద్ వ్యాఖ్యానించాడు.

ఇక ప్రస్తుతం ఐపీఎల్ ముగిసింది. ఈ ఐపీఎల్లో ఈసారి చాలామంది ప్లేయర్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. తిలక్ వర్మ.. పాటిదర్.. అయ్యర్.. కిషన్.. సంజు వంటి ప్లేయర్లు సత్తా చూపించారు. వారికి చెట్లను నడిపిన అనుభవం కూడా ఉంది. అందువల్ల ఇంగ్లాండ్ పర్యటనకు యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా సూర్య వంశీ వంటి ఆటగాడిని రంగంలోకి తీసుకొస్తే అప్పుడు ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ టూర్లలో టీమిండియా ఇదే తరహాలో దూకుడు కొనసాగిస్తే మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. కాకపోతే మేనేజ్మెంట్ ఏ తరహాలో ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version