BCCI – West Indies Tour : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి తర్వాత అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున జట్టు విమర్శలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో బిసిసిఐపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దేశం కోసం బలమైన జట్టును ఎంపిక చేయకపోవడం వల్లే కీలక టోర్నీల్లో భారత ఆటగాళ్లు చేతులెత్తేస్తున్నారు అంటూ మాజీ ఆటగాళ్లు, అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటిసి ఫైనల్ తర్వాత భారత జట్టు సుమారు నెల రోజులపాటు విశ్రాంతి తీసుకుని వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అయితే, ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.