Vozinha: ఫుట్ బాల్ ఆడే ప్లేయర్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. మైదానంలో చిరుత పులుల మాదిరిగా పరుగులు తీస్తూ ఉంటారు. బంతిని డిఫెండ్ చేయడం మాత్రమే కాదు… గోల్ పోస్ట్ లోకి పంపించడంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. దీనికోసం విపరీతమైన శిక్షణ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో నోటికి తాళం వేస్తారు.. మెచ్చిన మనుషులకు దూరంగా ఉంటారు. కేవలం ఆటే లోకంగా బతికేస్తూ ఉంటారు. ఫుట్ బాల్ ప్లేయర్లు 35 ఏళ్లలోపే ఉంటారు. సాధ్యమైనంత వరకు జట్లు కూడా అటువంటి ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తూ ఉంటాయి. వయసు పెరిగితే ఉత్సాహంగా ఆడలేరని జట్ల మేనేజ్మెంట్లు భావిస్తూ ఉంటాయి.
ఈ ఆటగాడి వయసు 40 సంవత్సరాలు ఒకానొక దశలో ఫుట్బాల్ కు వీడ్కోలు పలుకుదామని అనుకున్నాడు. దాదాపుగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అందరూ అభిమానులు భావించారు. మరి కొద్ది రోజుల్లో ఆ ప్రకటన చేస్తాడు అనుకుంటుండగా.. ఉన్నట్టుండి అతడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. కాకపోతే అతడి వయసు 40 సంవత్సరాలు.. అతని మీద అభిమానులకు పెద్దగా అంచనాలు కూడా లేవు. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని.. తన ఉత్సాహానికి అది అడ్డంకి కాదని నిరూపించాడు. ప్రస్తుత సాకర్ టోర్నీలో 40 సంవత్సరాల వయసులో రంగంలోకి దిగి.. తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపాడు. యావత్ ఫుట్బాల్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.. ఇంతకీ ఆటగాడి మరెవరో కాదు.. కాబో వెర్డే జాతీయుడు వోజీనా.
మాజీ ఛాంపియన్.. బలమైన స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వోజీనా దుమ్మురేపాడు. కాబో వేర్ డే జట్టుతో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ దాదాపు 27 సార్లు గోల్ చేయడానికి ప్రయత్నాలు చేసింది. కానీ ఒక బంతి కూడా నెట్లోకి దూసుకుపోలేకపోయింది.. దీనికి కాబో వెర్ డే ప్లేయర్ల నైపుణ్యం ప్రధాన కారణం. మరోవైపు గోల్ పోస్ట్ దగ్గర వోజీనా అడ్డు గోడ మాదిరిగా నిలిచాడు.. ఇతడు 25 సంవత్సరాల వయసులో ఫుట్బాల్ ప్రపంచంలోకి ప్రవేశించాడు. అనేక జట్ల తరఫున ఆడాడు. 2012లో కాబో వెర్ డే నేషనల్ టీమ్ లోకి ప్రవేశించాడు.
ఒక దశలో అతడు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకున్నాడు. కానీ సాకర్ లో ఆడాలని భావించి మళ్లీ వెనక్కి వచ్చాడు. స్పెయిన్ జట్టుతో చేసిన ప్రదర్శన నేపథ్యంలో అతడు రాత్రికి రాత్రే హీరో అయ్యాడు. ప్రపంచ కప్ ముందు వోజీనా కు ఇన్స్టాగ్రామ్ లో 50000 మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 24 లక్షల మించిపోయింది. అన్నట్టు ఇతడిని పెంచి పెద్ద చేసిన తాత.. అమ్మమ్మ.. అమ్మ మ్యాచ్ చూడలేకపోయారు. కొంతకాలం క్రితం అతడి తాత.. అమ్మమ్మ మరణించారు. అతని తల్లికి శ్వేత దేశం వెళ్లడానికి డబ్బులు సమకూరలేదు. దీంతో ఆమె ప్రపంచకప్ చూసేందుకు రాలేకపోయింది. ఇప్పుడు టీవీలో తన కొడుకు ప్రదర్శన చూసి ఎగిరి గంతులు వేసింది.
