Heath Streak : క్రికెట్ ప్రపంచంలో ఈ ఉదయం మరో విషాదం వినిపించింది. జింబాబ్వే దిగ్గజ ఆటగాడు, ఆ జట్టు లీడింగ్ వికెట్ టేకర్.. మాజీ కెప్టెన్, మాజీ ప్లేయర్ హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచాడని వార్తలు వచ్చాయి. అందరూ ఆయనకు నివాళులు కూడా అర్పించారు.. కానీ ఆయన మరణించలేదని స్వయంగా ఆ క్రికెటర్ పేర్కొనడం గమనార్హం. కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న స్ట్రీక్.. కోలుకోలేక 49 ఏళ్లకే కన్నుమూశాడని అన్నారు.. జింబాబ్వే జట్టుకు స్ట్రీక్ 12 ఏళ్లు ప్రాతినిధ్యం వహించాడు. తన బౌలింగ్తో ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. తన కెప్టెన్సీలో విదేశాల్లో తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందించాడు. జింబాబ్వే తరఫున ఇప్పటికీ టెస్టులు, వన్డేల్లో స్ట్రీక్ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతుండటం గమనార్హం.
దక్షిణాఫ్రికాలో మృతి..
గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్టీక్(49) దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతూ చనిపోయాడని వార్తలు వచ్చాయి. పెద్దప్రేగు, కాలేయం క్యాన్సర్ బారిన పడ్డాడు హీత్ స్ట్రీక్. హీత్ స్ట్రీక్ మరణ వార్తను అతడి సహచర ఆటగాడు హెన్రీ ఓలాంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ప్రపంచ క్రికెట్ ఓదార్చలేని స్థితిలో ఉందంటూ ట్వీట్ చేశాడు. కానీ ఆయన చనిపోలేదని తర్వాత స్వయంగా చెప్పాడు. స్ట్రీక్ జింజాబ్వే దేశ గొప్ప ఆల్ రౌండర్ అని పేర్కొన్నాడు. ప్రస్తుత జింబాబ్వే క్రికెట్ జట్టు కెప్టెన్ సీన్ విలియమ్స్ సైతం సంతాపం వ్యక్తం చేశాడు. భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాడు. అయితే ఆయన చనిపోలేదని ప్రకటించారు.
1993 నుంచి జట్టుకు ప్రాతినిధ్యం..
హీత్ స్ట్రీక్ 1993లో జింబాబ్వే క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల పాటు సాగిన కెరీర్లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా స్ట్రీక్ కొనసాగుతున్నాడు. జింబాబ్వే తరఫున టెస్టులు, వన్డేల్లో తొలి 100 వికెట్లు తీసిన బౌలర్ కూడా హీత్ స్ట్రీక్ కావడం గమనార్హం. హీత్ స్ట్రీక్ కేవలం బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లో కూడా సత్తాచాటాడు. టెస్టుల్లో 1990 రన్స్, వన్డేల్లో 2,943 రన్స్ స్కోరు చేశాడు.
ఆట తీరుతో సారథ్య బాధ్యతలు..
అరంగేట్రం నుంచి అద్భుత ఆటతీరు కనబర్చిన స్ట్రీక్ను ఆ దేశ క్రికెట్ బోర్డు 2000 సంవత్సరంలో జట్టుకు కెప్టెన్గా నియమించింది. అతడి సారథ్యంలోనే జింబాబ్వే జట్టు తొలిసారి విదేశాల్లో టెస్టు సిరీస్ విజయం నమోదు చేసింది. 2001 సంవత్సరంలో న్యూజిలాండ్ను 2–1తో ఓడించింది. అయితే బోర్డు, ఆటగాళ్ల మధ్య జరిగిన విభేదాల కారణంగా స్ట్రీక్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. 2005లో చివరగా భారత్తో టెస్టు మ్యాచు ఆడి.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
కోచ్గా కూడా రాణింపు..
హీత్ స్ట్రీక్ కేవలం ఆటగాడిగానే కాకుండా కోచ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. 2009 జింబాబ్వే జట్టుకు బౌలింగ్ కోచ్గా ఎంపికై.. నాలుగేళ్లపాటు పనిచేశాడు. 2018లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సైతం బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు కూడా బౌలింగ్లో మెలకువలు నేర్పించాడు.
అయితే హీత్ స్ట్రీక్ మరణించలేదని తాజాగా వార్తలు రావడం.. ఆయనే బయటకు వచ్చి తెలుపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.