Tilak Varma dropped catch: ఐపీఎల్ లో ప్రతి పరుగు అత్యంత విలువైనది. ప్రతి వికెట్ అంతకంటే ఎక్కువ విలువైనది. అందువల్లే ప్రతిక్షణం ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఐపీఎల్ లో ముంబై జట్టుకు వచ్చింది.
ఐపీఎల్ పేరు ప్రస్తావన వస్తే ముంబై జట్టు గురించి అభిమానులు గొప్పగా చెబుతుంటారు. ఎందుకంటే ముంబై జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ఏకంగా ఐదుసార్లు ట్రోఫీలను అందుకుంది. అంతేకాదు ఐపిఎల్ చరిత్రలో సరికొత్త ఘనతను తన పేరు మీద రాసుకుంది. ముంబై జట్టు అంతటి స్థాయి ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో సరిగ్గా ఆడలేక పోతోంది. ముఖ్యంగా ఐపీఎల్ లో దారుణమైన ప్రదర్శన చేస్తోంది.
ముంబై ఇండియన్స్ జట్టు దారుణమైన ఆట తీరు కొనసాగిస్తున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే అతడి సారధ్యంలో ముంబై జట్టు 2024లో చివరి స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు కూడా గ్రూప్ దశ నుంచి వెళ్లిపోతోంది. గత ఏడాది నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో గెలవాల్సిన సందర్భంలో ముంబై జట్టు ఓడిపోయింది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ప్లే ఆఫ్ నుంచి ముంబై అవుట్ కావడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు.
బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఎలిమినేట్ కావడం పట్ల అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రారంభంలో వికెట్లు పడగొట్టినప్పటికీ.. బెంగళూరు ఆటగాడు కృణాల్ పాండ్యా గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో 17 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన క్రమంలో పాండ్యా భారీ షాట్ కొట్టాడు. బౌండరీ వద్ద నమన్ బంతిని అందుకున్నాడు. తిలక్ వర్మ వైపు విసిరేశాడు. ఆ బంతిని తిలక్ అందుకోలేకపోయాడు. తర్వాత పాండ్యా 2 భారీ సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. తెలుగోడైన తిలక్ వర్మ ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. చివరికి కృణాల్ పాండ్యా తిలక్ వర్మ పట్టిన క్యాచ్ తోనే అవుట్ అయ్యాడు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.