Homeక్రీడలుక్రికెట్‌IND VS AUS Test match : యశస్వి జైస్వాల్ తో భారత ఇన్నింగ్స్ ప్రారంభించేది...

IND VS AUS Test match : యశస్వి జైస్వాల్ తో భారత ఇన్నింగ్స్ ప్రారంభించేది అతడే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇదే..

IND VS AUS Test match :  ప్రాక్టీస్ మ్యాచ్లో భారత – ఏ జట్టు బౌలర్ల చేతిలో కేఎల్ రాహుల్, గిల్, విరాట్ కోహ్లీ గాయపడ్డారు. గిల్ చేతి వేలుకు ఫ్రాక్చర్ కావడంతో ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడు తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు.. కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడ్డప్పటికీ.. తర్వాత తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఇటీవల కాలంలో కేఎల్ రాహుల్ పెద్దగా రాణించలేకపోతున్నాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత.. మళ్లీ అతడు ఆ స్థాయిలో సత్తా చాట లేకపోతున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ కు ఆస్ట్రేలియా సిరీస్ లిట్మస్ టెస్ట్ లాగా మారింది. ఇందులో గనుక అతడు రాణిస్తే.. టీమ్ ఇండియాకు ఇక తిరుగుండదు. ESPNcricinfo నివేదిక ప్రకారం మూడో స్థానంలో దేవ్ దత్ పడిక్కల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఐదవ స్థానంలో రిషబ్ పంత్ ఆర్థారని తెలుస్తోంది. ఆరవ స్థానంలో సర్ఫరాజ్, జురెల్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆల్ రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి, అశ్విన్ కు చోటు దక్కుతుందని సమాచారం. పేస్ బౌలర్ల విభాగంలో బుమ్రా, హర్షిత్ రాణా, సిరాజ్/ ఆకాష్ దీప్ ఆడతారని తెలుస్తోంది.

యువ ఆటగాళ్లకు అవకాశం

న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ కు గురైన నేపథ్యంలో.. టీమిండియా ఆస్ట్రేలియా సిరీస్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ముఖ్యంగా జట్టు కూర్పు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నది. ఆస్ట్రేలియా సిరీస్ లో సత్తా చాటితేనే భారత జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో తలపడేందుకు అవకాశం ఉంటుంది. అందువల్లే యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. ధ్రువ్ జురెల్, ఆకాష్ దీప్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లకు ఇదే తొలి ఆస్ట్రేలియా సిరీస్. ఈ సిరీస్ లో సత్తా చాటితే వారికి తిరుగు ఉండదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ అవసరాల నేపథ్యంలో తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. ఫలితంగా వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అతడి సారథ్యంలో టీమిండియా తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. గతంలో బుమ్రా కెప్టెన్సీలో భారత్ ఒక టెస్ట్ ఆడింది. అప్పుడు ఓడిపోయింది. 2022 లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత బుమ్రాకు జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version