Suryakumar Yadav: టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. వరుసగా రెండవసారి.. మొత్తంగా మూడోసారి t20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి జట్టుగా టీమ్ ఇండియా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు స్వదేశంలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచి.. మిగతా జట్లకు అందనంత ఎత్తులో నిలిచింది. టీమిండియా విజేతగా నిలవడం పట్ల అటు మాజీ క్రికెటర్లు.. ఇటు అభిమానులు.. టీమిండియా క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?
టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. తర్వాతి లక్ష్యం ఏంటి? వన్డే ప్రపంచ కప్ సాధించడమా? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో విజేతగా నిలవడమా? ఈ ప్రశ్నలలో టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ముందు ప్రస్తావిస్తే.. అతడు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. దీంతో ఆ సమాధానం విన్న విలేకరులు ఆశ్చర్యపోయారు.
“మా తదుపరి టార్గెట్ విశ్వ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించడం. 2028లో జరిగే టి20 వరల్డ్ కప్ సాధించడమని” సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఒలంపిక్స్ క్రీడలకు 128 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంతటి చరిత్ర ఉన్న క్రీడల్లో ఈసారి క్రికెట్ కు స్థానం కల్పించబోతున్నారు. 2028 లో జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ మ్యాచ్లను టి20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. క్రికెట్ మాత్రమే కాదు, స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్ బాల్, బేస్ బాల్/ సాఫ్ట్ బాల్, లాక్రోస్ వంటి క్రీడలను కూడా ఈసారి ఒలంపిక్స్ లో చేర్చబోతున్నారు. ఒలంపిక్స్ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి ఎటువంటి నిబంధనలు విధిస్తారు? ఈ పోటీలలో పాల్గొనే చెట్లకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఎటువంటి ప్రమాణాలను పాటిస్తారు? అనే అంశాలను ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఒలంపిక్స్ నిర్వహిస్తున్న అమెరికా నేరుగా క్రికెట్ పోటీలకు అర్హత సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.