ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట్లో వికెట్లను కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత టీమ్ ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. తద్వారా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 63 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బ్రేవిస్ 45 పరుగులు చేశాడు. స్టబ్స్ 44* పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిడియా బౌలర్లలో బుమ్రా మాత్రమే ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చాడు. మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అర్ష్ దీప్ సింగ్ నాలుగు ఓవర్ లు వేసి.. 28 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో రవి శాస్త్రి కామెంట్రీ సెక్షన్లో కూర్చున్నాడు. అతడితోపాటు బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా ఆసీనులయ్యారు. ఆయన టీమిండియా ఆట తీరు గురించి పదేపదే గొప్పగా చెప్పారు. కానీ ఆ స్థాయిలో టీమిండియా ప్లేయర్లు ఆడలేదు. క్రికెట్ తాను ఎందుకు చూస్తాను.. టీమిండియా ప్లేయర్లు ఆడుతుంటే ఎందుకు ఆస్వాదిస్తాను.. సొంత ఇష్టమైన ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆడుతుంటే ఎందుకు అంతగా ఆసక్తి కలిగించదు.. అనేక విషయాలపై రిషి సునాక్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. భావోద్వేగంగా మాట్లాడినప్పటికీ.. టీమిండియా ప్లేయర్లు ఆకట్టుకోలేకపోయారు.
” రవి శాస్త్రి ఎలాగు టీమిండియా ప్లేయర్లకు అనుకూలంగా మాట్లాడుతుంటారు. టీమ్ ఇండియా ప్లేయర్ల గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ ఈసారి ఆయనకు రిషి సునాక్ కూడా జతయ్యారు. కానీ, ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని కూడా టీమిండియా ప్లేయర్లు వినియోగించుకోలేకపోయారు. ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రిషి సునాక్ మైక్ అందుకోవడమే ఆలస్యం.. అహ్మదాబాద్ మైదానంలో కూర్చున్న వేలాదిమంది అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. టీమిండియా ఆటగాళ్ల గొప్పతనం గురించి.. వారు ఆడుతున్న తీరి గురించి గొప్పగా చెప్పారు. అయినప్పటికీ టీమిండియాకు ఉపయోగం లేకుండా పోయింది. ఆటగాళ్లు సరిగా ఆడలేక పోవడంతో అటు అభిమానులు.. ఇటు రిషి సునాక్ నిరాశకు గురయ్యారు.
Great to have a Tech Giant @sundarpichai in the comm box. He’s an avid cricket fan and with an amazing memory for facts and figures #IndvsSA #WT2026 pic.twitter.com/wf3uNF4cQg
— Ravi Shastri (@RaviShastriOfc) February 22, 2026