Team India Match Shocking Situation: టీమిండియా క్రికెట్ మ్యాచ్ లు ఆడుతుంటే మైదానాలు అభిమానులతో సందడిగా మారుతుంటాయి. కొన్ని సందర్భాలలో మైదానంలో టికెట్లు సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి టికెట్లు దొరకవు కూడా. సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది.
మనదేశంలో క్రికెట్ అనేది ఒక మతం అయితే.. ప్రపంచంలోనే అత్యధికమంది ఆచరించే మతంగా కొనసాగుతుంది. దీన్నిబట్టి మనదేశంలో క్రికెట్ చూసే వాళ్ళ సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా మన దేశంలో క్రికెట్ మ్యాచ్ లకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఐపీఎల్ లాంటి ఫార్మాట్ ప్రపంచ స్థాయి ప్రఖ్యాతి సాధించడం.. లక్షల కోట్ల మార్కెట్ సొంతం చేసుకోవడం మామూలు విషయాలు కావు. ఇవన్నీ కూడా అభిమానులు ఆటకు విపరీతమైన ఆదరణ అందించడం వల్లే సాధ్యమయ్యాయి. అయితే మన దేశంలో క్రికెట్ కు గడ్డు రోజులు వచ్చాయేమో అనిపిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో భారత్ ఏకైక టెస్ట్ ఆడుతోంది. చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ దాదాపుగా విక్టరీ సాధించినట్టే. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి రాలేదు. మొత్తంగా చూస్తే వెయ్యి మంది కూడా మైదానంలో లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనాలు లేకపోవడంతో స్టేడియాన్ని చూసి వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యపోయారు.
“ఐపీఎల్ లో అభిమానులు భారీగా మైదానాలకు తరలివచ్చారు. ప్రతి మైదానం కూడా అభిమానుల రాకతో సందడిగా మారిపోయింది. కొన్ని సందర్భాలలో ఇసుకవేస్తే రాలనంతగా ఫ్యాన్స్ రావడంతో.. ఐపీఎల్ నిర్వాహకులు పండగ చేసుకున్నారు. అయితే ఐపీఎల్ ముగిసిపోయింది. ఇప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్ట్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో గిల్ సేన విక్టరీ దిశగా సాగుతున్నప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో మ్యాచ్ అనగానే చాలామంది ఫ్యాన్స్ లో అంతగా ఆసక్తి అనిపించలేదు. అందువల్లే మ్యాచ్ చూసేందుకు పెద్దగా మైదానం లోకి రాలేదు. ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ డొమెస్టిక్ మ్యాచ్ మాదిరిగా అనిపిస్తోంది అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
