KL Rahul Unsold Maharaja T20 Trophy: నిజంగానే ఇది దారుణం. ఒక ఆనామక స్థాయి ఆటగాడికి ఈ స్థాయిలో పరాభవం ఎదురు కాదు. ఇలా జరుగుతుందని ఆటగాడు కూడా ఊహించి ఉండడు. తక్కువలో తక్కువ భారీ ధర దక్కుతుందని.. అతడు అనుకొని ఉంటాడు. కానీ అవేవీ జరగలేదు. అంతేకాదు అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.
ఈ దుస్థితి అనుభవిస్తున్న ఆటగాడి పేరు కేఎల్ రాహుల్. టీమిండియాలో ఈ కాలపు రాహుల్ ద్రావిడ్ లాగా పేరు తెచ్చుకున్న ఇతడు మహారాజా టి20 టోర్నీలో అమ్ముడుపోలేదు. చదువుతుంటే ఆందోళన కలిగినప్పటికీ ఇది నిజంగానే నిజం. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇతడిని 14 కోట్లకు ఆ జట్టు గతంలోనే కొనుగోలు చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్లో రాహుల్ ఏకంగా 593 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 152* పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంతటి విధ్వంసకరమైన ఆటగాడికి వేలంలో దారుణమైన పరాభవం ఎదురయింది. ఎందుకంటే అతడిని ఎవరు కొనుగోలు చేయలేదు. కనీసం రెండు లక్షలకు కూడా అతడిని సొంతం చేసుకోలేదు. దీంతో కేఎల్ రాహుల్ అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు.
కేఎల్ రాహుల్ సొంత రాష్ట్రమైన కర్ణాటకలో అక్కడి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతి ఏడాది మహారాజా టి20 పేరు మీద లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది.. ఈ ఏడాది సీజన్ కి సంబంధించి బెంగళూరులో మెగా వేలం జరిగింది. ఇందులో రెండు లక్షల కనీస ధరతో కేఎల్ రాహుల్ వేలంలోకి వచ్చాడు. అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు.
దీని వెనక ఒక కారణం ఉంది. ఎందుకంటే అతని మీద ఆసక్తి లేకపోవడం కాదు. వేలం సమయంలో రాహుల్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. అందువల్లే అన్ని జట్లు అతడిని కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు.. మరికొద్ది రోజుల్లో భారత జట్టు తరఫున రాహుల్ అంతర్జాతీయ మ్యాచులు ఆడుతాడు. ఈనెల 20న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ లో అతడు ఆడతాడు. ఇంగ్లాండ్ టూర్ లో కూడా అతడు పాల్గొంటాడు. అలాంటప్పుడు మహారాజ టోర్నీలో అతడు ఆడే అవకాశం లేదు.
మహారాజ టోర్నీ ఈనెల 20 నుంచి వచ్చే నెల 12 వరకు నిర్వహిస్తారు. ఈ టోర్నీ జరుగుతుండగానే భారత జాతీయ జట్టు ఐర్లాండ్తో జూన్ 26, 28 తేదీలలో రెండు టీ20 లో ఆడుతుంది. జూలై 1 నుంచి 10 వరకు ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టి 20 మ్యాచ్లు ఆడుతుంది. కాగా మహారాజా క్రికెట్ టోర్నీలో కర్ణాటక ప్లేయర్లు కరుణ్ నాయర్, మనీష్ పాండే భారీగా బిడ్ లు సొంతం చేసుకున్నారు. నాయర్ ను మంగళూరు డ్రాగన్స్ జట్టు యాజమాన్యం 18 లక్షలు.. పాండే కు గుల్బర్గా మిస్టిక్స్ 12.75 లక్షలకు కొనుగోలు చేశాయి.

