spot_img
Homeక్రీడలుక్రికెట్‌Kavya Maran controversy: కావ్య మారన్.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దమ్మా.. పునాదులు కదిలిపోతాయి

Kavya Maran controversy: కావ్య మారన్.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దమ్మా.. పునాదులు కదిలిపోతాయి

Kavya Maran controversy: క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టి ఉండవచ్చు. ఆస్ట్రేలియాలో అభివృద్ధి చెంది ఉండవచ్చు. కానీ గ్లోబల్ లో విపరీతమైన ప్రచారం లభించింది.. ఒక స్థాయిలో ఆదాయం వస్తోంది కేవలం ఇండియన్ మార్కెట్ నుంచే. అందువల్లే ప్రపంచ క్రికెట్లో ఇండియా డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అతిపెద్ద శ్రీమంతమైన బోర్డుగా కొనసాగుతోంది.

క్రికెట్ మీద ఐసిసి పెత్తనం సాగుతూ ఉండవచ్చు గాని.. ఐసీసీకి సింహభాగం ఆదాయం బీసీసీఐ అందిస్తోంది. బీసీసీఐ అందించే ఆదాయం ఆధారంగా క్రికెట్లో దాదాపు అన్ని క్రికెట్ బోర్డులు ఆర్థికంగా లాభ పడుతున్నాయి. బిసిసిఐ ఆస్తులు 20వేల కోట్లకు పైగా ఉంటే.. మిగతా అన్ని క్రికెట్ బోర్డుల ఆస్తులు కలిపినా కూడా ఆ స్థాయి లో లేవు. బిసిసిఐ ఐపీఎల్ ను 2008లో ప్రవేశపెట్టింది. అప్పటినుంచి ఐపీఎల్ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూనే ఉంది. ఏకంగా లక్ష కోట్లకు పైగా మార్కెటు వ్యాల్యూ ను సొంతం చేసుకుంది. మనదేశంలో గొప్ప గొప్ప కార్పొరేట్ వ్యక్తులు మొత్తం ఐపీఎల్లో జట్లను నిర్వహిస్తున్నారు.

ఐపీఎల్ లో ప్రముఖమైన జట్లలో సన్రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఈ జట్టుకు యజమానిగా కావ్య మారన్ వ్యవహరిస్తున్నారు. కావ్య నాయకత్వంలో హైదరాబాద్ క్రికెట్ జట్టు బలమైనదిగా ఎదిగింది. కావ్య హైదరాబాద్ జట్టును అనేక లీగ్ లలో ఆడిస్తోంది. అయితే కావ్య ది 100 క్రికెట్ లీగ్ టోర్నీలో సన్రైజర్స్ లీడ్స్ అనే జట్టును ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కావ్య పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకుంది. ఇది భారత అభిమానులకు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని కలిగించింది.

మొన్నటి నుంచి నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఇదే అంశం గురించి విపరీతమైన చర్చ మొదలైంది. అభిమానుల దెబ్బకు హైదరాబాద్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మూసుకోవాల్సి వచ్చింది. ఓ నివేదిక ప్రకారం హైదరాబాద్ జట్టు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ బ్లాక్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కావ్య మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ జట్టు సిబ్బంది ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది..

అహ్మద్ విషయంలో భారత క్రికెట్ అభిమానుల నుంచి ఈ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుందని కావ్య ఏ మాత్రం అంచనా వేయలేదు. అహ్మద్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఇండియన్ అభిమానులు. పైగా తన ఆగ్రహాన్ని అనేక రూపాలలో ప్రదర్శించారు. చివరికి జరిగిన విషయంలో హైదరాబాద్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటువంటి పరిణామాలు జట్టు యాజమాన్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అహ్మద్ విషయంలో కావ్య ఎన్ని చెప్పినప్పటికీ భారత క్రికెట్ అభిమానులు తమ ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేరని.. క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version