Homeక్రీడలుIPL Mega Auction 2025: నిరుడు కోట్లు. ఈ ఏడు అమ్ముడు పోక పాట్లు.. ఈ...

IPL Mega Auction 2025: నిరుడు కోట్లు. ఈ ఏడు అమ్ముడు పోక పాట్లు.. ఈ క్రికెటర్లను ఎవరూ దేకకపోవడం వెనుక..

IPL Mega Auction 2025: ఈ ఐపీఎల్ వేలంలో వైభవ్ సూర్య వంశీ అనే 13 సంవత్సరాల బాలుడు 1.10 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. అతడిని రాజస్థాన్ జట్టు పోటాపోటీ మధ్య దక్కించుకుంది. కానీ అతడి వయసుకంటే రెట్టింపు వయసున్న ఆటగాళ్లు.. అంతకుమించి అనుభవం ఉన్న ఆటగాళ్లు.. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. అలాగని వారేమీ అనామక ఆటగాళ్లు కాదు. రంజి నుంచి మొదలు పెడితే ఐపిఎల్ వరకు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి ఆకట్టుకున్నారు. అలాంటి ఆటగాళ్లు మొన్న జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడం సంచలనం కలిగించింది. గత ఐపీఎల్ వేలంలో వారు కళ్ళు చెదిరే ధర పలికారు. అయితే ఈసారి మాత్రం అమ్ముడుపోలేదు. కొందరికి అయితే అతి తక్కువ ధర లభించింది. ఉదాహరణకు మిచెల్ అనే ఆటగాడు 2024 లో జరిగిన మినీ వేలంలో 14 కోట్లకు అమ్ముడుపోయాడు. అల్జరీ జోసెఫ్ అనే ఆటగాడు 11.50 కోట్లకు, రూసో 8 కోట్లకు, పృథ్వీ షా 7.5 కోట్లకు అమ్ముడు పోయారు. కానీ ఈసారి ఈ ఆటగాళ్లను ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కనీసం వారి వైపు కూడా చూడలేదు. వారు తమ బేస్ ప్రైస్ 30 లక్షలకు తగ్గించుకున్నా ఎవరూ దేక లేదు.. ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే.. మరికొందరి ఆటగాళ్ల దుస్థితి మరో విధంగా ఉంది. సమీర్ రిజ్వీ అనే ఆటగాడు గత సీజన్లో 8.40 కోట్లు దక్కించుకున్నాడు. ఈసారి 95 లక్షలకే అమ్ముడుపోయాడు. కరణ్ 18.5 కోట్లకు అమ్ముడు పోగా.. ఈసారి 2.40 కోట్లకే పరిమితమయ్యాడు. స్టార్క్ 24.75 కోట్లకు అమ్ముడుపోగా.. ఈసారి 11.75 కోట్లకే పడిపోయాడు.

ఆశించినంత స్థాయిలో..

ఈ ఆటగాళ్లు గత సీజన్లో భారీ ధరకు అమ్ముడుపోయినప్పటికీ.. ఫ్రాంచైజీలు ఊహించినంతస్థాయిలో ప్రదర్శన చేయలేదు. అందువల్లే ఆ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలించుకున్నాయి. కోట్లకు కోట్లు ఇచ్చుకోవడం ఎందుకు? వారు ప్రదర్శన చేయనప్పుడు తలలు పట్టుకోవడం ఎందుకు? అనే సూత్రాన్ని యాజమాన్యాలు ఈసారి నూటికి నూరు శాతం పాటించాయి. అందువల్లే పై ఆటగాళ్లను యాజమాన్యాలు తీసుకోలేదు. కొంతమందికి భారీగా ధర చెల్లించినప్పటికీ.. వారు ఊహించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో యాజమాన్యాలు ఫీజు తగ్గించాయి. అందువల్లే గత సీజన్లో మెరుపులు మెరిపించిన ఆటగాళ్లు.. ఈసారి పూర్తిగా విఫలమయ్యారు. అటు ధరను ఆశించినంత స్థాయిలో దక్కించుకోక.. తలవంచుకున్నారు. ఏదో వేలంలో ఉన్నాం కాబట్టి.. కొనుగోలు చేశారనే స్థాయికి దిగజారి పోయారు. అయితే ఈ సీజన్లో తక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు.. తమ ఆట తీరును గనుక మెరుగుపరచుకుంటే.. వచ్చే మినీ వేలంలో ధర ను పెంచుకునే అవకాశం ఉంది. “ఆటగాళ్లు భారీ ధర వచ్చిన తర్వాత ఆట తీరు మీద దృష్టి సారించడం లేదు. అది అంతిమంగా వారి కెరియర్ మీద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికైనా తమ లోపాలను గుర్తించి.. వాటిని మెరుగుపరుచుకుంటే ఇబ్బంది ఉండదని” క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version