India Vs South Africa: ఈరోజు క్రికెట్ అభిమానులకి డబల్ ధమాకా…ఏంటంటే..?

రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద ఆడిన ఐదు టి20 మ్యాచు లను 4-1 తేడాతో ఆస్ట్రేలియాని చిత్తు చేసి ఇండియన్ టీమ్ ఆ సిరీస్ ని కైవసం చేసుకుంది.ఇక అదే మాదిరి సౌతాఫ్రికా టీమ్ ని కూడా చిత్తు చేయడానికి ఇండియన్ టీమ్ రెఢీ అయింది.

Written By: Gopi, Updated On : December 10, 2023 9:25 am

India Vs South Africa

Follow us on

India Vs South Africa: ఇండియా సౌతాఫ్రికా తో 3 టి 20 మ్యాచ్ లు ఆడడానికి సర్వ సిద్ధం చేసుకుంది.ఇక ఈనెల 10వ తేదీ నుంచి జరగబోయే టి20 మ్యాచ్ లను ఆడటానికి ఇప్పటికే ఇండియన్ టీం లోని ప్లేయర్లందరు రెడీ గా ఉన్నారు. ఇక ఈ 20 సీరీస్ ముగిసిన తర్వాత వన్డే , టెస్ట్ సిరీస్ లను కూడా ఆడబోతుంది. ఇక ఇలాంటి క్రమంలో టి20 మ్యాచ్ లకు యంగ్ ప్లేయర్లందరు కూడా బరిలోకి దిగిబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద ఆడిన ఐదు టి20 మ్యాచు లను 4-1 తేడాతో ఆస్ట్రేలియాని చిత్తు చేసి ఇండియన్ టీమ్ ఆ సిరీస్ ని కైవసం చేసుకుంది.ఇక అదే మాదిరి సౌతాఫ్రికా టీమ్ ని కూడా చిత్తు చేయడానికి ఇండియన్ టీమ్ రెఢీ అయింది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఇండియన్ టీం సౌతాఫ్రికా టీం ను కట్టడి చేస్తూ వాళ్లకి కూడా వీళ్ల మాదిరిగానే చుక్కలు చూపించాలని మన ప్లేయర్లు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇక ఈ సిరీస్ ని గెలిపించి సూర్య కుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో ఉన్న దమ్ము ఏంటో చూపించాలని తెగ ఆరట పడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా మీద ఒక సీరీస్ ని గెలిచింది, అలాగే ఈ సీరీస్ ని కూడా గెలిపించినట్లైతే వరుసగా రెండు టీ20 సిరీస్ లను గెలిపించిన కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ మంచి గుర్తింపు పొందుతాడు. ఇక ప్లేయర్లు కూడా తమదైన రీతిలో పర్ఫామెన్స్ ఇచ్చి టి20 ల్లో సత్తా చాటితే టి20 వరల్డ్ కప్ లో టీమ్ లో చోటు దక్కించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ తో ప్రతి ప్లేయర్ కూడా వచ్చిన అవకాశాన్ని 100% వాడుకోవాడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు… అయితే ఈ సిరీస్ లో శుభ్ మన్ గిల్ యశస్వి జైశ్వాల్ లాంటి యంగ్ ప్లేయర్లు భారీగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఫినిషర్ రోల్ ని ఫుల్ గా పోషించడానికి రింకు సింగ్ తనదైన రీతిలో రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదంతా బాగానే ఉంది కానీ ఇండియన్ టీం సౌతాఫ్రికా తో మొదటి టీ20 మ్యాచ్ ఆడుతున్న ఈరోజున ఇండియన్ అభిమానులందరికీ డబల్ ధమాకా ఉండనుంది.

అండర్ 19 ఏషియా కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ తో ఒక మ్యాచ్ ఆడనుంది ఈ మ్యాచ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ యూట్యూబ్ ఛానల్ లో ఈ మ్యాచ్ ని చూడవచ్చు.ఇక ఇండియా జట్ల మధ్య జరిగే టి20 మ్యాచ్ నైట్ 7:30 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం కనుండగా అభిమానులు అందరూ కూడా ఈ మ్యాచ్ ని అందులో ప్రత్యక్షం గా వీక్షించవచ్చు…