Homeక్రీడలుక్రికెట్‌Ind Vs Pak Women T20: రెచ్చిపోయిన భారత బౌలర్లు.. చుక్కలు చూసిన పాకిస్తాన్.. హర్మన్...

Ind Vs Pak Women T20: రెచ్చిపోయిన భారత బౌలర్లు.. చుక్కలు చూసిన పాకిస్తాన్.. హర్మన్ ప్రీత్ సేన టార్గెట్ ఎంతంటే?

Ind Vs Pak Women T20: ఇలాంటి నేపథ్యంలో భారత జట్టు సరికొత్తగా ప్రదర్శన చేసింది. మందకొడి మైదానం పై మంటలు మండించింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్ – భారత్ పోరు జరిగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మరో మాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇది తప్పుడు నిర్ణయమని భారత బౌలర్లు ప్రారంభంలోనే నిరూపించారు. శ్రేయాంక పాటిల్ వేసిన మొదటి ఓవర్ చివరి బంతికి పాకిస్తాన్ ఓపెనర్ గుల్ ఫిరోజా(0) రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. పాకిస్తాన్ జట్టు ఒక పరుగు వద్దే ఓపెనర్ వికెట్ కోల్పోవడంతో కాస్త తడబడింది. ఇక అప్పుడు మొదలైన భారత బౌలర్ల ప్రతాపం.. మ్యాచ్ చివరి వరకు కొనసాగింది. ముఖ్యంగా అరుంధతి రెడ్డి (3/19) మూడు వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్(2/12) రెండు వికెట్లు సాధించింది. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశా శోభన తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. దీంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టులో నిదా ధార్(28) టాప్ స్కోరర్ గా నిలిచింది. నిదా తర్వాత, ఓపెనర్ మునిబా అలీ (17) సెకండ్ టాప్ స్కోరర్ గా నిలిచింది. ఫాతిమాసనా(13) పరుగులు చేసి థర్డ్ టాప్ స్కోరర్ గా ఆవిర్భవించింది. వీరు ముగ్గురు తప్ప మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో పాకిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది..

మందకొడి మైదానంపై..

దుబాయ్ మైదానం మందకొడిగా ఉంటుంది. పేస్ బౌలర్లకు సహకరిస్తుంది. స్పిన్నర్లకు అప్పుడప్పుడు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మైదానంపై భారత స్పిన్, పేస్ బౌలర్లు బంతిపై సింగ్, బౌన్స్ ను రాబట్టారు. అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ జట్టు ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. వాస్తవానికి టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా బ్యాటింగ్ ఎంచుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా ఆటగాళ్లు అంతర్గతంగా సంబరపడ్డారు. ఎందుకంటే ఈ మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇబ్బంది ఎదురవుతుంది. ఆడగా ఆడగా మైదానం బ్యాటర్లకు సహకరిస్తుంది. అందువల్లే పాకిస్తాన్ ఆటగాళ్లు భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డారు. మరోవైపు తొలి మ్యాచ్లో 58 పరుగుల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడి మధ్య ఈ మ్యాచ్ ఆడింది. ఎలాగైనా గెలవాలనే కసితో భారత బౌలర్లు బౌలింగ్ చేశారు. ఫీల్డర్లు కూడా చురుగ్గా కదిలారు.. అందువల్ల పాకిస్తాన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. భారత్ ఎదుట 106 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ ను చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన భారత జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 3.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 16 పరులు చేసింది.. స్మృతి మందాన (6), షఫాలి వర్మ (6) క్రిజ్ లో ఉన్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version