spot_img
Homeక్రీడలుక్రికెట్‌India vs Australia: గెలుపు కష్టమే.. నిలిస్తేనే కనీసం డ్రా అవుతుంది.. ఆస్ట్రేలియా ముందు భారీ...

India vs Australia: గెలుపు కష్టమే.. నిలిస్తేనే కనీసం డ్రా అవుతుంది.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం

India vs Australia:  ఇంగ్లడ్‌–ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్‌ సిరీస్‌ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న సిరీస్‌ బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ సిరీస్‌ ఒక ఏడాది ఆస్ట్రేలియాలో.. తర్వాతి ఏడాది ఇండియాలో జరుగుతుంది. ప్రస్తుతం టీమిండియా సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ సిరీస్‌లో ఐదు టెస్టులు, ట్రయాంగిల్‌ వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ శుక్రవారం(నవంబర్‌ 22న) ప్రారంభమైంది. ఇందులో టీమిండియా డామినేసన్‌ కొనసాగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియా 150 పరగులకే ఆల్‌ఔట్‌ అయింది. తర్వాత ఆస్ట్రేలియాను బారత బౌలర్లు కేవలం 104 పరుగులకు కట్టడి చేసి 46 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ భారీ స్టోర్‌ చేసింది యశస్వి జైశ్వాల్‌ 161 పరుగులు, కోహ్లీ 100 నాటౌట్, కెఎల్‌ రాహుల 60 పరుగులతో రాణించారు. దీంతో టీమిండియా 487 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

టపటపా వికెట్లు..
ఇక భారీ లక్ష్యంలో రెండో ఇన్నింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బూమ్రా రెండు వికెట్లు, సిరాస్‌ ఒక వికెట్‌ పడొట్టాడు. ఆస్ట్రేలియా నాలుగో రోజు మూడు సెషన్లలో ఆడే ఆటపైనే మ్యాచ్‌ డ్రా ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియా వికెట్ల పడకుండా ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండేందుకు యత్నిస్తారు. ఇక పిచ్‌ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో మన సీమర్లు ఆస్ట్రేలియాను నాలుగో రోజే ఆల్‌ఔట్‌ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆసిస్‌కు సీనియర్ల సూచన..
ఇక నాలుగో రోజు ఎలా ఆడాలో సీనియర్‌ ఆటగాళ్లు ఆసిస్‌ జట్టుకు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా మూడు సెషన్ల కోసం ఎక్కువసేపు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. స్టీవ్‌ స్మిత్‌ జట్టు కోసం విరాట్‌ కోహ్లీ లాంటి పాత్ర పోషించినట్లయితే, ఆట ఐదవ రోజుకు వెళుతుంది. ఈ సిరీస్‌లో కనీసం మూడు పరీక్షలు ఐదు రోజులు వెళ్లాలని కోరుకుంటున్నామని పేర్కొంటున్నారు. ‘ఇది సుదీర్ఘ సిరీస్, ఆధిపత్యం ఒక జట్టు నుంచి∙మరొక జట్టుకు సంప్‌ అపుతుంది. ఆస్ట్రేలియాకు వారి రోజులు ఉంటాయి, కొన్ని రోజుల్లో భారతదేశం కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది’ అని మాథ్యూ హేడెన్‌ చెప్పారు.

– భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కూడా తన అంచనాను ఇచ్చారు. ‘భారతదేశం మొదటి టెస్ట్‌ గెలవబోతోంది. టీ వరకు ఆస్ట్రేలియా ఆల్‌ఔట్‌ అయ్యే అవకాశం ఉంది అని తెలిపారు.

– కొనసాగుతున్న సరిహద్దు–గవాస్కర్‌ ట్రోఫీ 2024–25 ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లను కలిగి ఉంది, మరియు ఇండియా నేషనల్‌ క్రికెట్‌ జట్టు 4–0తో గెలవాలి, ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్స్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper
Exit mobile version