Homeక్రీడలుక్రికెట్‌India vs Afghanistan Test: ఆఫ్గనిస్తానే కదా అని నిర్లక్ష్యం వద్దు.. టీమిండియా వీటి మీద...

India vs Afghanistan Test: ఆఫ్గనిస్తానే కదా అని నిర్లక్ష్యం వద్దు.. టీమిండియా వీటి మీద దృష్టి పెట్టాల్సిందే..

India vs Afghanistan Test: దాదాపు 7 నెలల విరామం తర్వాత టీమిండియా ప్లేయర్లు తెలుపు రంగు దుస్తులు వేసుకోబోతున్నారు. స్వదేశం వేదికగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో ఏకైక టెస్ట్ ఆడబోతున్నారు. టెస్ట్ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ పసికూన. అలాగని ఆ జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నారు. ఏదైనా జరగరనిది జరిగితే భారత్ కు ఇబ్బంది తప్పదు. అసలే డబ్ల్యూటీసి పాయింట్లలో భారత్ ఆరవ స్థానంలో ఉంది. అలాంటప్పుడు ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే ఏకైక మ్యాచ్ భారత జట్టుకు అత్యంత ముఖ్యం. ఈ మ్యాచ్లో కనుక భారత్ భారీ తేడాతో గెలిస్తే.. డబ్ల్యూటీసి పాయింట్లలో తన స్థానాలను మెరుగుపరుచుకుంటుంది.

చండీగఢ్ కొత్త స్టేడియంలో శనివారం నుంచి ఈ టెస్ట్ జరుగుతుంది.. ఇటీవల ఈ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ లేడు. అలాగని ఆ జట్టు అంత సులభంగా కనిపించడం లేదు. టి20 ఫార్మాట్.. వన్డే ఫార్మేట్ లో పెద్ద పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. టెస్ట్ క్రికెట్లో కూడా అదే స్థాయిలో ఆడితే మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు.

టెస్ట్ క్రికెట్లో స్వదేశంలో టీం ఇండియాకు గతంలో తిరుగు లేని రికార్డు ఉండేది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల చేతిలో దారుణమైన పరాభవాలు ఎదురు కావడం టీమిండియా ఆట తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వీడ్కోలు పలికిన తర్వాత టెస్ట్ జట్టు కాస్త కళ తప్పింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ విభాగంలో టీమిండియా ఆరో స్థానంలో ఉండడంతో ఈ మ్యాచ్ గెలవడం అత్యంత అవసరం.. ఈ మ్యాచ్లో జడేజా కూడా లేడు. అశ్విన్ రిటర్మెంట్ తీసుకోవడం.. జడేజా లేకపోవడం ఒకరకంగా టీమ్ ఇండియాకు ఇబ్బంది. భారత స్పిన్ విభాగాన్ని కులదీప్ యాదవ్ ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ సుందర్ కూడా అతడికి సహకారం అందిస్తాడు. ఇక హర్ష్ దూబే, మానవ సుతార్ ఎవరో ఒకరు జట్టులోకి వస్తారు. సిరాజ్ పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం ఇస్తాడు. ప్రసిద్ధి కృష్ణ అతడితోపాటు బంతి పంచుకుంటాడు. బుమ్రా కు విశ్రాంతి ఇచ్చారు.. ఓపెనర్లుగా జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు.. సాయి సుదర్శన్ మూడో స్థానం..గిల్, పంత్, జురెల్, సుందర్ తర్వాత స్థానాలలో బ్యాట్ అందుకుంటారు.. భారత్ ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేస్తే రెండవ ఇన్నింగ్స్ ఆడకుండానే.. భారీగా పరుగు చేస్తున్న అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

2018లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో భారత్ బెంగళూరు వేదికగా ఒక టెస్ట్ ఆడింది. ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మైదానం లో నల్లటి మట్టితో కూడిన పిచ్ రూపొందించారు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. వర్షం ముప్పు లేదు. కాకపోతే ప్రారంభంలో పేస్ బౌలర్లకు.. ఆ తర్వాత స్పిన్ బౌలర్లకు మైదానం అనుకూలిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular