IND Vs PAK: ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించే క్రీడ ఏదైనా ఉందంటే అది ఫుట్ బాల్ మాత్రమే. ఫుట్ బాల్ లో అనేక రకాలైన పోటీలు జరుగుతూనే ఉంటాయి. ఆ పోటీలు అభిమానులకు అద్భుతమైన ఆట మజాను అందిస్తూనే ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తొలిసారి ఫుట్ బాల్ క్రికెట్ ముందు ఓడిపోయింది. కూడా భారత్, పాకిస్తాన్ ముందు తల వంచింది.
క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందువల్లే ఐసీసీ భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తూ ఉంటుంది. విపరీతమైన అభిమానుల ఆదరణ.. భారీగా ఆదాయం వస్తుంది కాబట్టి ఐసీసీ భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తుంది..
ఇక మన దేశంలో క్రికెట్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ల గురించి వివరించాల్సిన పనిలేదు. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో కచ్చితంగా పాకిస్తాన్, భారత్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ ల ను ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ మ్యాచులు కేవలం క్రికెట్ పరంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఫుట్ బాల్ ఆటను కూడా మించిపోతున్నాయి.
Luxury అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన మ్యాచుల జాబితాలో మూడు, ఐదు స్థానాలలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ గేమ్స్ ఉన్నాయి. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ఏకంగా 1.5 బిలియన్ వ్యూస్ నమోదు చేసింది. 2018 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 1.12 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఫిఫా వరల్డ్ కప్ 2014 ఫైనల్ మ్యాచ్ 1.1 బిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 2023 వరల్డ్ కప్ మ్యాచ్ ను 950 మిలియన్ల మంది వీక్షించారు.
ఈ సంస్థ వీక్షణల ఆధారంగానే ఈ కేటగిరీలను ప్రకటించింది. ఆదాయం పరంగా ఏ మ్యాచులు ముందు వరుసలో ఉంటాయో చెప్పలేదు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆదాయం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. దాదాపు వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అందువల్లే ఐసీసీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.
