Homeక్రీడలుక్రికెట్‌Nitish Kumar Reddy: ఇంట విజయం సాధించి.. రచ్చ గెలిచి చూపించాడు.. దటీజ్ నితీష్ కుమార్...

Nitish Kumar Reddy: ఇంట విజయం సాధించి.. రచ్చ గెలిచి చూపించాడు.. దటీజ్ నితీష్ కుమార్ రెడ్డి..

Nitish Kumar Reddy: సోషల్ మీడియా నుంచి మీడియా వరకు శనివారం నితీష్ కుమార్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. మామూలుగా కాదు ట్విట్టర్లో అయితే అతడే ట్రెండింగ్లో ఉన్నాడు.. పాలిటిక్స్, స్పోర్ట్స్, సెలబ్రిటీ.. ఇలా అన్ని విభాగాలలో అతడే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల కాలంలో ఒక క్రికెటర్ ఈ స్థాయిలో ఘనతను సాధించలేదు. హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత పుష్ప మానరిజంతో అల్లు అర్జున్ అభిమానుల ప్రేమను సంపాదించుకున్నాడు. మెల్బోర్న్ మైదానంలో సెంచరీ చేసిన తర్వాత జెండా పాడినట్టుగా సంకేతం ఇచ్చి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల అభిమానాన్ని చురగొన్నాడు.. చివరికి ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు కూడా తన సెంచరీ కోసం ప్రార్థనలు చేసే విధంగా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే నితీష్ కుమార్ రెడ్డి అందరి హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి ఈ స్థాయి దాకా చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా పల్లాలను కూడా చూశాడు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. తాను నిర్దేశించుకున్న వదిలిపెట్టలేదు. అందువల్లే అతడు ఈ స్థాయికి ఎదిగాడు.

రంజీ లో..

టీమిండియాలో స్థానం సంపాదించడం కంటే ముందు రంజీలో తన ప్రతాపాన్ని చూపించాడు. దేశవాళి క్రికెట్లో ఆంధ్ర జట్టు తరఫున ఆడాడు. ఆల్ రౌండర్ గా అండర్ 19 బి టీంకు ప్రాతినిధ్యం వహించాడు. 17 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. అందులో 566 పరుగులు చేశాడు. ఇక రంజీలలో ఆంధ్ర జట్టు తరఫున ఏడు మ్యాచులు ఆడాడు. వేగంగా 366 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. తన ఆల్ రౌండర్ ప్రదర్శన ద్వారా ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ అభిమానాన్ని చురగొన్నాడు. దీంతో వారు అతడిని వేలంలో 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేశారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నితీష్ కుమార్ రెడ్డి ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇదే క్రమంలో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఏకంగా సెంచరీ చేసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి… సూపర్ సెంచరీ చేసి.. ఒకప్పటి లెజెండరీ క్రికెటర్ అనిల్ కుంబ్లే(87) పేరు మీద ఉన్న రికార్డును బాధలు కొట్టాడు. మొత్తంగా ఎనిమిదో నెంబర్ లో బ్యాటింగ్ కు దిగి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. రంజి క్రికెట్లో నేర్చుకున్న నేర్పును.. సాధించిన ఓర్పును టెస్ట్ క్రికెట్లో అమలులో పెట్టడం మొదలుపెట్టాడు. అందువల్లే నితీష్ కుమార్ రెడ్డి ఈ స్థాయిలో విజయం సాధించగలిగాడు. ఆస్ట్రేలియా బౌలర్ల పై అధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే.. తన బ్యాటింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. అందువల్లే సెంచరీ చేసి టీమ్ ఇండియాకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version