spot_img
Homeక్రీడలుక్రికెట్‌Champions Trophy 2025: సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కమిన్స్‌.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా!

Champions Trophy 2025: సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కమిన్స్‌.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా!

Champions Trophy 2025: వన్డే వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీ తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న ట్రోఫీ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy). మరో నెల రోజుల్లో 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీంతో ఇందులో తలపడే దేశాలు జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ తమ జట్లను ప్రకటించాయి. తాజాగా ఆస్ట్రేలియా(Australia) కూడా ఈ మూగా టోర్నీకి జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక(Srilanka) టూర్‌కు దూరంగా ఉన్న కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌(Pat Cammins) సర్‌ప్రైజల్‌గా జట్టులోకి వచ్చాడు. అతడి నేతృత్వంలోనే ఛాంపియన్స్‌ ట్రోఫీ బరిలో దిగనుంది.

గాయపడిన కమిన్స్‌..
ప్యాట్‌ కమిన్స్‌ చాలా రోజులుగ ఆచీల మండల గాయంతో బాధపడుతున్నాడు భారత్‌తో జరిగిన బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ తర్వాత ఈ నొప్పి తిరగబెట్టింది. దీంతో శ్రీలంకతో జరిగే సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చింది. ఈనెల చివరన కమిన్స్‌ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ రెండు కారణాలతో కమిన్స్‌ శ్రీలంకతో ఆడలేకపోయాడు. స్టీవ్‌ స్మిత్‌ శ్రీలంకతో ఆడే జట్టుకు సారథ్యం వమిస్తున్నారు. అయితే కమిన్స్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడతాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కమిన్స్‌ అభిమానులు ఆందోళన చెందారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కమిన్స్‌ తిరిగి జట్టులోకి వచ్చారు.

ఆస్ట్రేలియా జట్టు ఇదే..
ప్యాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), అలెక్స్‌ కేరీ, నాథన్‌ ఎలీస్, ఆరోన్‌ హార్డీ, జోష్‌ హేజెల్‌వుడ్, ట్రావిస్‌ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, మార్నస్‌ లబుషేన్, మిచెల్‌ మార్ష్, గ్లెన్‌ మాక్స్‌వెల్, మ్యాట్‌ షార్ట్, స్టీవ్‌స్మిత్, మిచెల్‌ స్టార్క్, మార్కస్‌ స్టాయినిస్, ఆడమ్‌ జంపా.

ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్‌ ట్రోపీ..
ఇదిలా ఉంటే ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 9 వరకు టోర్నీ జరుగుతుంది. ఇందులో గ్రూప్‌–ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, గ్రూప్‌–బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘానిస్తాన్‌ జట్లు ఉన్నాయి.

న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన..
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా పొరుగు దేశం న్యూజిలాండ్‌(Newziland)కూడా ఛాంపియన్స్‌ ట్రోఫీకి జట్టును ప్రకటించింది. మిచెల్‌ సాంట్నర్‌ సారథ్యంలో కివీస్‌ జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడనుంది. తుది జట్టు ఇదే..
డేవన్‌ కాన్వే, మార్క్‌ చాప్‌మన్, నాథన్‌ స్మిత్, రచిన్‌ రవీంద్ర, విల్‌యంగ్, బెన్‌ సీర్స్, కేన్‌ విలియమ్సన్, గ్లెన్‌ ఫిలిప్స్, లాకీ ఫెర్గూసన్, టామ్‌ లేథమ్, మిచెల్‌ బ్రేస్వెల్, మ్యాట్‌ హెన్రీ, డారెల్‌ మిచెల్, మిచెల్‌ సాంట్నర్‌(కెప్టెన్‌), విల్‌ ఓరౌర్కీ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version