Homeక్రీడలుక్రికెట్‌IND Vs ENG Series : ఇంగ్లాండ్ తో టి20, వన్డే సిరీస్.. రోహిత్, విరాట్ కీలక...

IND Vs ENG Series : ఇంగ్లాండ్ తో టి20, వన్డే సిరీస్.. రోహిత్, విరాట్ కీలక నిర్ణయం..

IND  Vs ENG Series :  ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ (Boarder Gavaskar) ట్రోఫీని కోల్పోయిన నేపథ్యంలో టీమిండియా (Team India) పై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన వరుస ఓటముల నుంచి ఉపశమనం పొందాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టి20, వన్డే సిరీస్ గెలవాలని యోచిస్తోంది. అయితే జట్టుకూర్పు విషయంలో ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్ కసరత్తు మొదలుపెట్టింది. దీనికంటే ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కు దూరంగా ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వారిద్దరు కూడా జట్టులో ఉంటారని.. వన్డే సిరీస్ లో ఇద్దరూ ఆడతారని టీమిండియా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల టి20 లకు రోహిత్, విరాట్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టి20 వరల్డ్ కప్ ను టీమ్ ఇండియా గెలిచిన తర్వాత.. వారిద్దరు పొట్టి ఫార్మాట్ కు శాశ్వత విశ్రాంతి పలికారు. అయితే కొంతకాలంగా సరైన ఫామ్ లో లేకపోవడం.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లలో వీరిద్దరూ దారుణంగా విఫలం కావడంతో.. పూర్వపు లయను అందుకోవడానికి వీరిద్దరూ తెగ ప్రయత్నిస్తున్నారు. అందువల్లే ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సిరీస్ లో రాణించాలని భావిస్తున్నారు.

బుమ్రా కు రెస్ట్

ఈ సిరీస్లో టీమిండియా స్పీడ్ గన్ బుమ్రా కు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. కొంతకాలంగా బుమ్రా విపరీతంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఏమాత్రం రెస్ట్ లేకుండా సిరీస్ లలో పాలుపంచుకుంటున్నాడు. దీంతో అతడికి ఇంగ్లాండ్ సిరీస్ లో రెస్ట్ ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అతడి స్థానంలో కొత్త బౌలర్లకు అవకాశం ఇవ్వనుంది. మరోవైపు ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ ద్వారా మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వీరు టి20 తో పాటు వన్డే టోర్నీ కూడా ఆడతారు. అయితే టి20 లలో దక్షిణాఫ్రికా తో జరిగిన సిరీస్లో విజయం సాధించిన జట్టునే.. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లోనూ ఆడించాలని టీం ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.. ఇందులో ప్రతిభ చూపిన ఆటగాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాన్ని కల్పించనుంది. టీమిండియా యువ ఆటగాళ్లు కొంతకాలంగా స్థిరమైన ప్రదర్శన చేస్తున్నారు. ఒకరు కాకపోతే మరొకరు రెచ్చిపోయి ఆడుతున్నారు. అంతిమంగా జట్టుకు విజయాలతో పాటు ట్రోఫీలను కూడా అందిస్తున్నారు. అందువల్ల టీమిండియా టి20 వరల్డ్ కప్ తర్వాత ఇంతవరకు ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు.. పైగా విదేశాలలోనూ టీమిండియా అదరగొడుతోంది.. ఛాంపియన్ గా ఆవిర్భవిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version