India Vs Pakistan: ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభమైంది. సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. టోర్నమెంట్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై–వోల్టేజ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ బ్రాడ్కాస్టర్కు డిమాండ్ను పెంచుతోంది. రాబోయే ఆసియా కప్ సందర్భంగా భారత్ రెండు గ్రూప్ మ్యాచ్లలో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ల ద్వారా బ్రాడ్కాస్టర్కు భారీగా ఆదాయం సమకూరబోతోంది.
కనీసం రూ.350 కోట్లు..
ఆసియా కప్–2023తో డిస్నీ హాట్ స్టార్కు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు యాడ్ రెవెన్యూ రానుంది. ఇక భారత్–పాకిస్తాన్ మ్యాచ్ కోసం 10 సెకన్ల యాడ్ కాస్ట్ రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత్ కాకుండా ఇతర జట్లు ఆడే మ్యాచ్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి భారత్– పాక్ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. ఇదిలా ఉంటే డిస్నీ + హాట్స్టార్లో టోర్నీ మొత్తం ఫ్రీగా వీక్షించొచ్చు.
సెప్టెంబర్ 2న ఇండియా – పాక్ మ్యాచ్…
ఇక ఆసియా కప్లో భారత తొలి మ్యాచ్ దాయాది దేశం పాకిస్తాన్తోనే మొదలు కాబోతోంది. శనివారం ఈ మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2023 ఆసియా కప్కు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త. భారతీయ అభిమానులు ఇప్పుడు ఆసియా కప్లోని అన్ని మ్యాచ్లను ఉచితంగా ఏఈలో వీక్షించగలరు. ఇకపై మొబైల్తోపాటు టీవీలో కూడా ఉచితంగా మ్యాచ్ను వీక్షించవచ్చు. దీని కోసం దూరదర్శన్ పెద్ద ప్రకటన చేసింది.
డీడీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం..
డీడీ స్పోర్ట్స్ ఛానెల్లో భారతీయ అభిమానులు ఆసియా కప్లోని అన్ని మ్యాచ్లను ఉచితంగా వీక్షించగలరు. దీనికి ముందు ఈఈ స్పోర్ట్స్ ఏఈ లేదు. అయితే ఇది ఆసియా కప్తో మొదలవుతోంది. టీమ్ ఇండియా అభిమానులకు ఇది పెద్ద కానుక కాదు. ఇంతకుముందు హాట్స్టార్ మొబైల్లో ఆసియా కప్ను ఉచితంగా చూపిస్తామని ప్రకటించింది.
టీమిండియా సిద్ధం..
రోహిత్శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆసియాకప్కు పూర్తి సన్నద్ధం అయింది. ఈమేరకు జట్టు బుధవారం శ్రీలంకకు బయలుదేరింది. మొదటి మ్యాచ్ పల్లెకెలెలో శనివారం జరగనుంది. నేపాల్తో భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా పల్లెకెలెలో జరగనుంది.