Homeఆధ్యాత్మికంVasant Panchami : వసంత పంచమి ఎప్పుడు? ఏ సమయానికి సరస్వతి దేవిని పూజించాలి? ముఖ్యంగా...

Vasant Panchami : వసంత పంచమి ఎప్పుడు? ఏ సమయానికి సరస్వతి దేవిని పూజించాలి? ముఖ్యంగా విద్యార్థులు?

Vasant Panchami : హిందూ మతంలో తల్లి సరస్వతిని జ్ఞానం, కళ, సంగీతానికి దేవతగా భావిస్తుంటారు. వసంత పంచమి రోజున ఈ మాతా సరస్వతిని భక్తులు ఎక్కువగా కొలుస్తుంటారు. విద్య, వృత్తిలో విజయం కోసం తల్లి సరస్వతిని పూజించడం భక్తులకు చాలా ఇష్టం. ఇక చిన్న పిల్లల చదువులు కూడా వసంత పంచమి రోజునే మొదలు పెట్టేవారు ఎక్కువ ఉంటారు. అయితే విద్యార్థులు పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో విజయం సాధించాలని కూడా చాలా మంది ఈ తల్లని వేడుకుంటారు. అలాంటి విద్యార్థులు వసంత పంచమి రోజు కోసం ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. మరి ఈ వసంత పంచమి ఎప్పుడు? ఏ రోజున ఏ సమయానికి చేసుకోవాలంటే?

హిందూ మతంలో, మాఘ మాసాన్ని పండుగల మాసం అని పిలుస్తుంటారు. ఎందుకంటే సకత్ చౌత్, షట్టిల ఏకాదశి, మౌని అమావాస్య, గుప్త నవరాత్రి వంటి పెద్ద పండుగలు ఈ నెలలో జరుపుకుంటారు. ఈ సమయంలో, వసంత పంచమి పండుగ కూడా ఈ మాసంలో వస్తుంది. ఇది సంగీత దేవత అయిన సరస్వతీ దేవి ఆరాధనకు అంకితం అయిన రోజు. ఈ రోజున ఆ తల్లిని పూజించడం వల్ల సాధకులకు సంతోషం పెరుగుతుందని నమ్మకం. క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం వసంత పంచమిని మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు.

ఈ రోజున తల్లి సరస్వతి జన్మించింది. ఈ సందర్భంగా ఇళ్లు, దేవాలయాలు, అన్ని విద్యాసంస్థల్లో సరస్వతీ పూజను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు విద్యార్థులకు మరింత ప్రత్యేకంగా పరిగణిస్తారు. తల్లి సరస్వతిని విద్య, మేధస్సు, సంగీతం, సృజనాత్మకత దేవత అని పిలుస్తుంటారు కూడా. అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్యార్థులలో కళా నైపుణ్యాలు మెరుగుపడతాయి. జ్ఞానాన్ని పెంచుతుంది ఆ సరస్వతి తల్లి. ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు అనే గందరగోళం నెలకొంది. అటువంటి పరిస్థితిలో, ఈ కథనం ద్వారా సరైన తేదీ, పూజ ముహూర్తం గురించి వివరంగా తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం మాఘమాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఫిబ్రవరి 2, 2025 ఉదయం 9.14 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఫిబ్రవరి 3 ఉదయం 6:52 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఉదయ తిథి ప్రకారం, వసంత పంచమి పండుగను 2 ఫిబ్రవరి 2025 న జరుపుకుంటారు. ఇక ఈ రోజున విద్యార్థులు ఆ తల్లిని పూజించడం వల్ల అనుగ్రహిస్తుందని కూడా నమ్ముతారు ప్రజలు.

ఈ సంవత్సరం, 2 ఫిబ్రవరి 2025, వసంత పంచమి రోజున, పూజ శుభ సమయం ఉదయం 7.09 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12.35 వరకు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ కాలంలో సరస్వతీ దేవిని పూజించవచ్చు. ఇక పంచాంగం ప్రకారం, ఫిబ్రవరి 2 న ఉత్తరా భాద్రపద నక్షత్రం ఏర్పడుతుంది. దానిపై శివ, సిద్ధ యోగాల కలయిక ఉంటుంది. ఈ తేదీలో సూర్యుడు మకరరాశిలో ఉంటాడు. ఈ సమయంలో అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:13 నుంచి 12:56 వరకు ఉంటుంది. అమృతకాల్ 20:24 నుండి 21:53 నిమిషాల వరకు ఉంటుంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular