Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈరోజు 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈరోజు 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 15న శుక్రవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కన్య, ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
కుటుంబంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారం చేసేవారికి అనుకూలం. ఇతతులతో వాగ్వాదానికి ఎక్కువగా దిగొద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

వృషభం:
ఉద్యోగులకు కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది. తండ్రితో సంబంధం మెరుగుపడుతుంది. ముఖ్యమైన సలహాలు పొందవచ్చు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి అనుకూల వాతావరణం.

మిథునం:
విద్యార్థులకు మార్గం సుగమం అవుతుంది. సాయంత్రం ఆకస్మిక వార్తలు వింటారు. ప్రేమ జీవితం గడుపుతున్న వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

కర్కాటకం:
ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మనసులోని ఆలోచనలు తల్లిదండ్రులతో పంచుకుంటారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.

సింహం:
జీవిత భాగస్వామితో గడుపుతారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. ఖర్చులు పెరిగే అవకాశం. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

కన్య:
స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎవరైనా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నట్లయితే ఓపికగా ఉండాలి. సాయంత్రం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల:
విద్యార్థులు సమస్యల నుంచి బయటపడుతారు. పిల్లల కోసం పెట్టుబడులు పెడుతారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. బంధువుల్లో ఒకరికి అనారోగ్యం రావొచ్చు.

వృశ్చికం:
విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక లావాదేవావీలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వస్తువుల చోరీకి గురయ్యే అవకాశం. విహారయాత్రలకు ప్లాన్ వేస్తారు.

ధనస్సు:
బావోద్వేగాల కారణంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సాయంత్ర కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొంత నష్టాన్ని చూడగలుగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది.

మకర:
కొన్ని నిరుత్సాహకరమైర వార్తలు వింటారు. కోరికలు నెరవేరుతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి.

కుంభం:
కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావొచ్చు. పిల్లలతో ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని విషయాలో మౌనంగా ఉండడమే మంచిది.

మీనం: ఆదాయం రెట్టింపు అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నియత్రణలో ఉండాలి. విదేశీ వ్యాపారం చేసేవారికి అనుకూల వాతావరణం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version