Homeఆధ్యాత్మికం Temple Entry Restrictions:  భారతదేశంలోని ఈ గుడిలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం.. మాజీ ప్రధానమంత్రిని కూడా...

 Temple Entry Restrictions:  భారతదేశంలోని ఈ గుడిలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం.. మాజీ ప్రధానమంత్రిని కూడా ఆపారు. ఎందుకంటే?

Temple Entry Restrictions : భారతదేశంలోని అనేక దేవాలయాలు వాటి నమ్మకాల కారణంగా వార్తల్లో నిలుస్తుంటాయి. భారతదేశంలో అనేక అద్భుత, మర్మమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతారు . ఈ మర్మమైన దేవాలయాలతో పాటు, కొన్ని దేవాలయాల నియమాలు, నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశ నియమాల నుంచి భక్తులు ధరించే దుస్తుల వరకు అనేక నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అయితే, ఆలయ ప్రాంగణంలోకి హిందువులు మాత్రమే ప్రవేశించడానికి అనుమతించే అనేక దేవాలయాలు ఉన్నాయి. హిందువులు కానివారు లేదా నాస్తికులు ఈ దేవాలయాలలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. హిందువులు కాకపోయిన లేదా మరే ఇతర మతానికి చెందిన వ్యక్తుల ప్రవేశం నిషేధం. మరి ఆ దేవాలయాల గురించి ఈరోజు తెలుసుకుందాం…

Also Read : ఇప్పుడు ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా పైలట్లు కావచ్చు! ఎలాగంటే?

తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్: తిరుమల కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసం. ఇది భారతదేశంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయాలలో ఒకటి. హిందువులు కాకుండా ఇతర మతాల వారు ఈ ఆలయంలోకి ప్రవేశించడం నిషేధం. ఇతర మతాల ప్రజలు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే, వారు శ్రీ వెంకటేశ్వర స్వామిపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ అఫిడవిట్ ఇవ్వాలి.

గురువాయూర్ ఆలయం, కేరళ: కేరళలోని గురువాయూర్ ఆలయం హిందువుల విశ్వాస కేంద్రంగా ఉంది. ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఇతర మతాల వారికి ఈ ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. ఈ ఆలయంలోని ప్రధాన దేవత బాల్ గోపాల్. కన్హయ్యను గురువాయూరప్పన్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం శ్రీకృష్ణుడు, విష్ణువు నివాసంగా పరిగణిస్తారు. దీనిని వైకుంఠ, దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు.

పద్మనాభస్వామి ఆలయం, కేరళ: ఈ విష్ణు ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇది కేరళలోని చారిత్రక ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం పురాణాలలో కూడా ప్రస్తావించారు. ఈ టెంపుల్ ను 16వ శతాబ్దంలో ట్రావెన్కోర్ కాలం నాటి రాజులు, నిర్మించారని చరిత్ర చెబుతుంది. ప్రతి సంవత్సరం భారతదేశం, విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అయితే, ఇతర మతాల వారికి భగవంతుడిని చూసే అవకాశం లభించదు. హిందువులు కాని వారికి ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం.

జగన్నాథ ఆలయం, పూరి: ఈ ఆలయం విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడికి అంకితం చేశారు. జగన్నాథ ఆలయం భువనేశ్వర్ సమీపంలోని పూరి నగరంలో బంగాళాఖాతం సమీపంలో ఉంది. ఈ ఆలయంలోకి హిందువులు తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఒక సైన్ బోర్డు ఉంది. ఈ బోర్డుపై సనాతన హిందువులు మాత్రమే ఇక్కడకు ప్రవేశించడానికి అనుమతి ఉందని రాశారు. అంతే కాదు, హిందువులు కాని వ్యక్తులు కూడా ఈ ఆలయంలో అడుగు పెట్టడానికి, జగన్నాథుడిని చూడటానికి అనుమతి లేదు. 1984లో, అప్పటి భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కూడా తన భర్త వేరే మతానికి చెందినవాడు కాబట్టి ఈ ఆలయంలోకి అడుగు పెట్టడానికి అనుమతించలేదట.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version