Homeఆధ్యాత్మికంAkshaya Tritiya : అక్షయ తృతీయ రోజు వీరు బంగారం కొనుగోలు చేస్తే.. లక్కు లో...

Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు వీరు బంగారం కొనుగోలు చేస్తే.. లక్కు లో పడ్డట్లే..

Akshaya Tritiya  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజు ఏ పని చేపట్టిన శుభం జరుగుతుందని చాలామంది భావిస్తారు. అయితే ఎలాంటి శుభకార్యం లేని వారు ఈరోజు కొంచమైనా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవితో ఇంటికి వస్తుందని భావిస్తారు. అందుకే చాలామంది కొంచమైనా బంగారం కొనుగోలు చేస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు బంగారం కొనుగోలు చేయడం వల్ల వారికి అధికమైన ప్రయోజనాలు ఉండరున్నాయి. వీరికి అప్పటినుంచి దశ తిరిగాయి అవకాశముంది. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం వచ్చే అక్షయ తృతీయ రోజున గజకేసరి రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీంతో ఈ రోజున బంగారం కొనుగోలు చేసిన వారికి ఊహించని విధంగా లాభాలు ఉండలు ఉన్నాయి. ఇంతకీ ఆ అదృష్టవంతుల రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..

Also Read : అక్షయ తృతీయ నాడు మీ రాశి ప్రకారం ఇలా చేయండి. అదృష్టం వరిస్తుంది..

2025 ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రాబోతుంది. ఈరోజు నా శ్రీ మహాలక్ష్మి, మహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాకుండా ఈరోజు ఏదైనా శుభకార్యం నిర్వహించుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఇదే రోజు బంగారం కొనుగోలు చేయడం వల్ల ఎంతో సిరిసంపదలు ఉంటాయని అనుకుంటారు. కానీ ఈ రాశిల వారు బంగారం కొనుగోలు చేయడం వల్ల మరింత ప్రయోజనాలు పొందుతారు.

కర్కాట రాశి వారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది. ఆ తర్వాత వీరు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. మిగతా వ్యాపారాలు కూడా ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులు అధిక ప్రయోజనాలు పొందుతారు. అదనపు ఆదాయం పెరిగి సంతోషంగా ఉంటారు. ఎలాంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్న వెంటనే పూర్తి చేస్తారు.

వృషభ రాశి వారికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే సంపద పెరగనుంది. ఈ రాశి వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇవి లాభాలు ఇస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విహారయాత్రలకు వెళ్లి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. ఈరోజు నా బంగారం కొనుగోలు చేసేవారు ఆ తర్వాత ఎక్కువ బంగారాన్ని పొందే అవకాశం ఉంటుంది.

తులా రాశి వారికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే కలిసి రానుంది. ఇప్పటినుంచి వీరికి పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. బంధువుల నుంచి ధన సహాయ మండుతుంది. ఇంటి నిర్మాణం కోసం ఖర్చులు చేస్తారు. అయితే వీటికి కోసం డబ్బు సహాయం అందుతుంది. పొరుగు వారితో స్నేహ సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మకర రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. వీరు ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే అన్నీ కలిసి వస్తాయి. ఇప్పటినుంచి వీరికి మహర్దశ పట్టణం ఉంది. చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపడతారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular