దేశంలో కరోనా కల్లోలానికి, కారణం.. ఆ ప్రార్థనలు?

ప్రస్తుతం భారత్ లో కరోనా రక్కసి కోరలు చాచిన వేళ, అందుకు గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారుల అన్వేషణ మార్చి 13,14, 15 తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనలపై పడింది.ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఈ ప్రార్ధనలకు దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కుడా సుమారు 2 వేల మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వారిలో చాలామందికి […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 6:50 pm
Follow us on

ప్రస్తుతం భారత్ లో కరోనా రక్కసి కోరలు చాచిన వేళ, అందుకు గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారుల అన్వేషణ మార్చి 13,14, 15 తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనలపై పడింది.ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఈ ప్రార్ధనలకు దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కుడా సుమారు 2 వేల మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.

వారిలో చాలామందికి కరోనా సోకినట్టుగా అధికారులు అంచనాకు వచ్చారు. అందులో ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు విధిగా తమ వివరాలు తెలపాలని అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
ప్రార్థనల్లో పాల్గొన్న 2వేల మంది తెలుగువారిలో
తెలంగాణలో ఏకంగా ఆరుగురు కరోనాతో చనిపోవడం, ఆ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌ లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రెండు రోజుల పాటు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌ లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు పాల్గొనగా, ఈ ప్రార్థనలకు ఇతర దేశాల నుంచి మత పెద్దలు సైతం వచ్చినట్టుగా అధికారుల విచారణలో తెలిసింది. ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 2వేల మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనలకు హాజరయినట్టుగా సమాచారం.

అంతర్జాతీయ స్థాయిలో ప్రార్థనా మందిరంలో రెండున్నర రోజులపాటు ఓ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మంది హాజరుకాగా, వీరిలో అత్యధికులు మార్చి 14-,15వ తేదీల్లో తమ తమ ప్రాంతాల నుంచి రైళ్లలో వెళ్లారు. 16, 17, 18వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించడంతో పాటు ఢిల్లీలో ఉన్నన్నీ రోజులు కలిసే బస చేశారు. తిరుగు ప్రయాణంలో వీరంతా దురంతో ఎక్స్‌ప్రెస్, ఎపి ఎక్స్‌ప్రెస్‌ లలో ప్రయాణించినట్టుగా అధికారులు గుర్తించారు.

గ్రేటర్ హైదరాబాద్ నుంచి దాదాపు 300 మంది
ఢిల్లీలో ప్రార్థనలకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి దాదాపు 300 మంది వెళ్లినట్లు సమాచారం. వారిలో 150 మంది వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చాక వైరస్ లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చింది. అతడి నుంచి కుటుంబసభ్యుల్లో నలుగురికి వైరస్ సోకింది. దీంతో వైద్యశాఖ అధికారులు ఢిల్లీ ప్రార్థనా మందిరం నిర్వాహకులను సంప్రదించి ఆ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించారు. ఆ వివరాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లిన వారికి పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఈ ప్రార్ధనలకు వెళ్లి న నాగర్ కర్నూల్ వాసికి కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 78కి చేరింది.ఇక, రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు 8మంది మరణించారు.