రాజ్యసభలోనూ నెగ్గిన వ్యవసాయ బిల్లు

వ్యవసాయరంగంలో మార్పులు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఎట్టకేలకు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును ఆదివారం ఉదయం వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసలతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బిల్లుకు మద్తతు తెలుపగా తెలంగాణ మాత్రం వ్యతిరేకించింది. తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. […]

Written By: NARESH, Updated On : September 20, 2020 4:03 pm

rajya sabha

Follow us on

వ్యవసాయరంగంలో మార్పులు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఎట్టకేలకు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును ఆదివారం ఉదయం వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసలతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బిల్లుకు మద్తతు తెలుపగా తెలంగాణ మాత్రం వ్యతిరేకించింది. తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

Also Read: ఏపీ పరువును గంగలో కలుపుతున్న టీడీపీ వైసీపీ నేతలు?