2014 నుంచి 2020 వరకు జనసేన పార్టీ అనేక మలుపులు తిరిగి, కుదుపులకు గురై 6వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంలో ఆ పార్టీని గూర్చి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
ఒకటి లేదా రెండు ఎదురు దెబ్బలకే మనకెందుకొచ్చిన రాజకీయాలు అనుకునే రాజకీయ నాయకులకు భిన్నంగా 6సంవత్సరాలుగా అనేక అవరోధానాలకు ఎదురొడ్డి నిలబడ్డ ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది. హాయిగా సాగే రంగుల జీవితం నుంచి అసత్య, అవాస్తవ విమర్శలు చేసే రాజకీయ జీవితాన్ని ఎంచుకున్న పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే బలమైన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు అని చెప్పడంలో అతిసేయోక్తి లేదు. ఈ 6ఏళ్లలో అనేక సమస్యలపై పోరాడి, ప్రజలలో తనదైన ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్. సమాజం పట్ల, భావితరాల పట్ల బాధ్యత ఉందని, ప్రజల తరుపున ప్రశ్నించే గొంతుక అయ్యాడు పవన్. అవినీతి రహిత రాజకీయాలను ప్రజలకు చూపించాలని 6ఏళ్ళ క్రితం ఇదే రోజున జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్.
6ఏళ్లలో జనసేన…
రాష్ట్ర విభజన, ప్రజారాజ్యం పార్టీ చేదు అనుభవాలతో మార్చి 14, 2014న పవన్ కళ్యాణ్ ఎన్నో అవాంతరాలు, అపనమ్మకాల మధ్య జనసేన పార్టీ పెట్టారు. దింతో జనసేనపై మెగా అభిమానులు కూడా అంత ఆసక్తి చూపలేదు అయినా వెనుకడుగు వేయకుండా పార్టీని స్థాపించి పవర్ స్టార్ కాస్త జనసేనానిగా మారారు.
2014 సాధారణ ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉండడం పార్టీ నిర్మాణం లేకపోవడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చిన జనసేనాని మొదటి నుండి కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత, మోడీ నాయకత్వం పై ప్రజలు సానుకూలంగా ఉండడంతో జనసేనాని వెంటనే గుజరాత్ వెళ్లడం, మోడీ, బీజేపీకి భేషరతు మద్దతు ప్రకటించి ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని మాటిచ్చారు.
అప్పటికే చుక్కాని లేని నావలా ఉన్న టీడీపీ 2009-14 మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు అలాంటి సమయంలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులకి కూడా నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ బీజేపీతో జట్టు కట్టడంతో వెంటనే చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకోవాలని నిర్ణయించాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అటు బీజేపీ తో పాటు నాకు ప్రచారం చేసి పెట్టాలని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి దేహి అని అర్ధించడంతో అనుభవంలో జగన్ కన్నా చంద్రబాబు మేలని విడిపోయిన రాష్ట్రానికి తన అనుభవంతో న్యాయం చేస్తాడని టీడీపి-బీజేపీ కూటమికి ప్రచారం చేయడంతో 1.7 శాతం ఓట్ల తేడాతో కూటమి గెలిచింది ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టడం ప్రజా వ్యతిరేక పాలన వల్ల 2019 లో టీడీపీ కి వ్యతిరేకంగా పోటీచేసిన జగన్ బృందం చేసిన టీడీపీ-జనసేన కుమ్మక్కు ప్రచారం వల్ల జనసేన అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.
2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు తన అసలు బలం తెలిసి భవిష్యత్ లో జనసేనతో కలిసి పోటీ చేయాలి అని ఆలోచన చేసి ప్రతి సభలో వైసీపీ, పవన్ కళ్యాణ్ పై చేసే విమర్శలు తిప్పి కొట్టినట్టు నటించి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను తన వైపు లాక్కోవాలని అనుకున్నాడు అయితే ఇవన్నీ తెలిసినా మౌనంగా ఉంటూ వైసీపీ యొక్క అధికారం తెచ్చిన అహంకారం ఎదుర్కోవాలంటే కేంద్రంలో బలమైన,నమ్మకమైన బీజేపీతో జట్టు కట్టాలని భావించాడు పవన్. బీజేపీ మరియు మోడీని 2019 ఎన్నికల్లో అణిచివేయాలని చూసిన చంద్రబాబుని ఇక జీవితంలో కలిసేది లేదని అమిత్ షా ప్రకటించడంతో ఆ పార్టీతో పొత్తుకు జనసేనాని ఒప్పుకున్నారు.
ప్రస్తుతం బీజేపీ-జనసేన కూటమి 2020స్థానిక ఎన్నికలలో తన మార్క్ ని చూపించాలనే ఆలోచనలో ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఈ కూటమి ఎంతవరకు కట్టడి చేస్తుందో.. తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Janasena party political journey
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com