
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8218 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81763 టెస్టులు చేయగా దాదాపు 8వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కు పెరిగాయి.ఇక శనివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 58గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5302కు పెరిగింది.